భారత ప్రభుత్వ అధికారుల ఆదేశాలతోనే డొమినికా పోలీసులు తనను అరెస్టు చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆరోపించారు. ఈ మేరకు డొమినికా ఇమ్మిగ్రేషన్ మంత్రి, అక్కడి పోలీస్ చీఫ్, దర్యాప్తు అధికారిపై హైకోర్టులో కేసు వేశారు. తనపై ఉన్న కేసులన్నంటినీ కొట్టివేయాలని కోరారు. చోక్సీ అదృశ్యం, అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే.