ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు అమెరికా కోర్టు భారీగా జరిమానా విధించింది. ఇస్రోకు చందిన యాంత్రిక్ కార్పొరేషన్ రెండు శాలిటైట్లు అభివృద్ధి చేసిన, ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్లో సిగ్నల్ అందించే విధంగా దేవాస్తో 2005లో ఒప్పందం కుదుర్చుకున్నది. కానీ ఆ ఒప్పందాన్ని 2011లో యాంత్రిక్స్ రద్దు చేసింది. దీని పట్ల దేవాస్ కోర్టులను ఆశ్రయించింది. ఈ కేసులో భారత సుప్రీంను ఆశ్రయించిన దేవాస్కు ట్రిబ్యులనల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే సియాటిల్లోని వాషింగ్టన్ జిల్లా కోర్టు థామస్ జెల్లీ 27న తీర్పు వెల్లడించారు. దేవాస్కు 56.2 కోట్ల డార్ల జరిమానా చెల్లించాలని, వడ్డితో కలిపి మొత్తం నష్టపరిహారం 102 కోట్ల డాలర్లు చెల్లించాలని సియాటిల్ కోర్టు తీర్పునిచ్చింది. యాంత్రిక్స్ ప్రధాన కార్యాలయంల సియాటిల్లో ఉన్నందున దేవాస్ అమెరికా కోర్టును ఆశ్రయించింది.