
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా జట్టుకు కోల్పోవడం నిరాశగా ఉన్నా.. సిరీస్ ఓటమితో మాకు మంచి గుణపాఠం కలిగిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. బుధవారం మూడో వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజంటేషన్ సందర్భంగా మ్యాచ్ విజయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘మా పర్యటన ఇక్కడితో ముగిసిపోలేదు. రానున్న రోజుల్లో మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది అన్నాడు.