YCP Leader: మ‌హిళానేత‌పై అలాంటి కామెంట్ చేసిన వైసీపీ నేత‌.. ఇంత దారుణ‌మా..?

YCP Leader: ఏ రాష్ట్రంలో లేని దారుణ‌మైన రాజకీయాలు ఒక్క ఏపీలోనే కొన‌సాగుతున్నాయి. ఎంత‌లా వైసీపీకి ఎవ‌రైనా ఎదురు మాట్లాడితే వారి మీదే దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసి అవ‌మానిస్తున్నారు. ఏకంగా వ్య‌క్తిగ‌తంగా నింద‌లు వేసి ఎవ‌రూ మాట్లాడ‌కుండా చేస్తున్నారు వైసీపీ నేత‌లు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల ద‌గ్గ‌రి నుంచి మొద‌లు పెడితే.. మంత్రుల వ‌ర‌కు అంద‌రిదీ ఇదే బాట‌. వారు మైకుల ముందుకు వ‌స్తే ఎలాంటి ముత్యాలు రాలుతాయో చాలా సార్లు చూశాం. ఇక ఇప్పుడు ఇందుకు నిద‌ర్శ‌నంగా […]

Written By: Mallesh, Updated On : April 1, 2022 3:55 pm

YCP

Follow us on

YCP Leader: ఏ రాష్ట్రంలో లేని దారుణ‌మైన రాజకీయాలు ఒక్క ఏపీలోనే కొన‌సాగుతున్నాయి. ఎంత‌లా వైసీపీకి ఎవ‌రైనా ఎదురు మాట్లాడితే వారి మీదే దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసి అవ‌మానిస్తున్నారు. ఏకంగా వ్య‌క్తిగ‌తంగా నింద‌లు వేసి ఎవ‌రూ మాట్లాడ‌కుండా చేస్తున్నారు వైసీపీ నేత‌లు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల ద‌గ్గ‌రి నుంచి మొద‌లు పెడితే.. మంత్రుల వ‌ర‌కు అంద‌రిదీ ఇదే బాట‌. వారు మైకుల ముందుకు వ‌స్తే ఎలాంటి ముత్యాలు రాలుతాయో చాలా సార్లు చూశాం.

YCP Leader

ఇక ఇప్పుడు ఇందుకు నిద‌ర్శ‌నంగా ఓ వైసీపీ నేత లైవ్ లో చేసిన కామెంట్ ర‌చ్చ‌కు దారి తీస్తోంది. ఏకంగా ఓ మ‌హిళా నేత మీద అత్యంత దారుణ‌మైన వ్యాఖ్య చేశారు. దాన్ని బ‌ట్టి చూస్తుంటే.. వైసీపీ నేత‌ల‌కు అధినేత వ‌ద్ద నుంచి ఎలాంటి ఆదేశాలు వెళ్తున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా ఎదురు మాట్లాడితే.. వారిమీదే నింద‌లు వేస్తున్నారంటే.. వైసీపీ పాల‌సీ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా ఓ టీవీ ఛానెల్ లో జ‌రుగుతున్న డిబేట్ లో కావ‌లికి చెందిన టీడీపీ మ‌హిళా నేత గ్రీష్మ పాల్గొన్నారు. ఇదే డిబేట్ లో వైసీపీ నేత మూర్తి కూడా పాల్గొన్నారు. అయితే ఈ చ‌ర్చ‌లో ఆమె ఏపీలో మ‌హిళ‌ల మీద జ‌రుగుతున్న దాడుల గురించి, అత్యాచారాల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో భ‌ద్ర‌త క‌రువైందంటూ ఏక‌రువు పెట్టారు.

దీంతో మ‌ధ్య‌లో మూర్తి ఎదురు దాడి చేశారు. చ‌ర్చ వాడీ వేడీగా సాగుతున్న క్రమంలో అత‌ను కంట్రోల్ త‌ప్పి.. చివ‌ర‌కు ఆమె మీద దారుణ‌మైన కామెంట్ చేశారు. నువ్వేమైనా మెంటల్ హాస్పిటల్ నుంచి వ‌చ్చావా.. నీ మీద ఎవ‌రైనా మానభంగం చేశారా అంటూ అన‌కూడ‌ని మాట అనేశారు. పైగా అస‌లు నువ్వు ఏపీలోనే ఉన్నావా అంటూ బెద‌రింపు ధోర‌ణిలో మాట్లాడారు.

YCP

ఇలాంటి కామెంట్ నిజంగా దారుణ‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే మ‌హిళ‌ల భ‌ద్ర‌త గురించి అడిగితే.. అందుకు ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌ల గురించి చెప్పాలి గానీ.. ఇలా రేప్ చేశారా అన‌డ‌మేంట‌ని స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. అయితే దీనికి గ్రీష్మ స్పందిస్తూ.. మీరేమైనా కొడాలి నాని దగ్గర క్రాష్ కోర్సు చేశారా అంటూ ఫైర్ అయింది. తాను ఇలాంటి వ్య‌క్తితో అస్స‌లు మాట్లాడ‌బోనంటూ మౌనంగా ఉండిపోయింది. అయితే ఈ ఘ‌ట‌న‌మీద లోకేష్ ట్వీట్ చేశారు. మూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేత‌లు ఎంత దారుణంగా మారిపోతున్నారో అర్థం అవుతోంద‌ని, వారికి మ‌హిళా శ‌క్తి ఏంటో చూపించాలంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బాగా వైర‌ల్ అవుతోంది. దీంతో వైసీపీ పాల‌సీయే ఇలాంటిదంటూ కొడాలి నాని లాంటి వారిని చూపిస్తున్నారు. మొత్తానికి వైసీపీ నేత‌ల తీరు ఎంత దారుణ‌మైందో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

Tags