జగన్ సర్కార్ ది పేరు గొప్ప..ఊరు దిబ్బ

వాహన మిత్ర పథకంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు మరోసారి ముందుకొస్తోంది. దీని కోసం ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది. రెండు లక్షల నలభై వేల మందికి అప్పగించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందజేసేందుకు సిద్ధమైంది. బీమా ప్రీమియం దగ్గర్నుంచి ట్యాక్సులు కట్టుకోవడానికి ఇవి ఉపయోగించుకోవాలని చెబుతున్నారు. రాష్ర్టంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సొంత ఆటోలు, కార్లు, రవాణా వాహనాలు వంటి వాటిని ఆధారంగా చేసుకుని కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతూ […]

Written By: Srinivas, Updated On : June 15, 2021 3:21 pm
Follow us on

వాహన మిత్ర పథకంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు మరోసారి ముందుకొస్తోంది. దీని కోసం ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది. రెండు లక్షల నలభై వేల మందికి అప్పగించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందజేసేందుకు సిద్ధమైంది. బీమా ప్రీమియం దగ్గర్నుంచి ట్యాక్సులు కట్టుకోవడానికి ఇవి ఉపయోగించుకోవాలని చెబుతున్నారు.

రాష్ర్టంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సొంత ఆటోలు, కార్లు, రవాణా వాహనాలు వంటి వాటిని ఆధారంగా చేసుకుని కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతూ ఉంటారు. రాష్ర్టం మొత్తం మీద రెండున్నర లక్షల మందికే ఇస్తున్నారు. సగటున నియోజకవర్గానికి 1400 మంది లబ్ధిదారులు మాత్రమే. అంత తక్కువ మంది పథకం వర్తింపజేసి అలా ఫుల్ పేజీ ప్రకటనల పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటన్నది ప్రధానంగా అందరిలోనూ వినిపిస్తున్న ప్రశ్న.

మేనిఫెస్టోలో డ్రైవర్లందరికీ రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. కానీ అమల్లోకి వచ్చే సరికి సవాలక్ష నిబంధనలు పెట్టారు. అందులో ప్రధానమైనది. సొంత వాహనం కలిగి ఉండటం. సొంత వాహనం ఉంటేనే అర్హులు కాదు. నిరుపేదలై ఉండాలి. నాలుగు చక్రాల వాహనం ఉంటే పేదల జాబితా నుంచి తొలగించేస్తారు. ఈ అడ్డంకులన్నీ తొలగించుకుని ఎలాగోలా వాలంటీర్లను పట్టుకుని ఎన్ రోల్ అవ్వాలి. అంతా చేస్తే రూ.పది వేలు ఇస్తారు.

చివరికి మొత్తంగా ఇలా అన్ని రకాల అర్హుల్ని తేల్చి చివరికి రెండున్నర లక్షల మందికి చేర్చారు. దీంతో వాహనాల మీద ఆధారపడి అనేక మంది బతుకుతుంటారు. వారికెవరికి పథకం అందడం లేదు కంటి తుడుపుగా అతి కొద్ది మందికి సాయం చేసి అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి అమలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.