spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Jaganmohan Reddy: అందుకే ఆ పార్టీతో సఖ్యత.. లెక్కలేసుకున్న జగన్..?

YS Jaganmohan Reddy: అందుకే ఆ పార్టీతో సఖ్యత.. లెక్కలేసుకున్న జగన్..?

YS Jaganmohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతతోనే ఉన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీపై కాలు దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పలు పార్టీల నేతలను కలుస్తున్నారు. కాగా, జగన్ మాత్రం బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. కాగా, ఆ విషయం జగన్‌కు కలిసొస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచినట్లయితే బీజేపీకి ఫ్రంట్‌లో లేని పార్టీల మద్దతు కూడా అవసరముంటుంది. అలా అవసరమైనప్పుడు బీజేపీకి జగన్ మద్దతు తెలపాలని అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాక వైసీపీ వైఖరి ఏంటనేది స్పష్టంగా తేలుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Aloso Read:  కెరీర్ మధ్యలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ వీళ్లే..

ఒకవేళ ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీచినట్లయితే జగన్ కు ఆ విషయం కలిసొస్తుందని, అలా రాష్ట్రానికి కావల్సిన కొన్ని పనులు అయినా జగన్ కేంద్ర సహకారంతో చేయించుకోగలడని కొందరు చెప్తున్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఫ్రెండ్‌గా ఉండాలని జగన్ భావిస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. అయితే, ఈ ఫ్రెండ్ షిప్ బహిరంగంగా మాత్రం బయటపడటం లేదు. ఇప్పటికి అయితే ఏపీలో బీజేపీకి అఫీషియల్‌గా పొత్తులో ఉన్న పార్టీ జనసేన. కాగా, అన్ అఫీషియల్‌గా వైసీపీ పొత్తులో ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.

గతంలో కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలకు వైసీపీ మద్దతు తెలిపింది కూడా. కాగా, భవిష్యత్తులో బీజేపీతో పొత్తుకు వైసీపీ ప్రయత్నిస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇకపోతే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా బీజేపీతో పొత్తుకు రెడీ అంటున్నదని వార్తలొస్తున్నాయి. మొత్తంగా ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయం బాగా హీటెక్కింది. జనసేన, బీజేపీలతో పొత్తుకు తాము రెడీ గా ఉన్నామనే సంకేతాలను ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబు ఇచ్చారనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో ఉంది.

Aloso Read: కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై వ్యవసాయ రంగ నిపుణుల సూచనలేంటి.. ఆశిస్తున్నదేంటి?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper