spot_img
Homeజాతీయ వార్తలుRaghav Chadha Parliament Speech: మోదీ, నిర్మలకు.. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చి పడేసిన ఓ యువ...

Raghav Chadha Parliament Speech: మోదీ, నిర్మలకు.. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చి పడేసిన ఓ యువ ఎంపీ కథ.. ముఖంపై నెత్తురు చుక్క లేదు

Raghav Chadha Parliament Speech: 2026 మార్చి 10, లోక్‌సభలో బడ్జెట్‌ చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా యువ ఎంపీ లేచి మాట్లాడడం మొదలు పెట్టారు. అయితే గతంలో ఎవరూ ప్రస్తావించని అంశాలను ప్రస్తావించారు. సామాన్యుడి కోణంలో లోక్‌సభ సాక్షిగా అనేక ప్రశ్నలు కేంద్రానికి సంధించారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పెరుగుదల, మొబైల్‌ రీచార్జీల ధరలు, బ్యాంక్‌ పెనాల్టీలను యువ ఎంపి ఎక్కుపెట్టిన తీరు యావత్‌ దేశాన్ని ఆకర్షించింది. తెలుగు రాష్ట్రాల నుంచి∙ఎన్నికైన ఈ యువ సభ్యుడి పేరు రాఘవ్‌ చద్దా. ఇన్‌స్పైర్డ్‌ వాయిస్‌గా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ల ముందు నిలబడ్డాడు.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

యువ ఎంపీ బ్యాక్‌గ్రౌండ్‌..
ఈ యువ ఎంపీ ఆంధ్రప్రదేశ్‌ రాసపూడిపాలెం నుండి వచ్చినవాడు. ఐటీ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎన్నికల సమయంలోనే ‘మధ్యతరగతి రక్షణ‘ అనే స్లోగన్‌తో ప్రజల మద్దతు పొందాడు. పార్లమెంట్‌కు వచ్చాక, రాఘవ్‌ చద్దా సోషల్‌ మీడియా పోస్టులు చదివి, 10 వేల మంది లేఖలు సేకరించాడు. ‘ద్రవ్యోల్బణం 6% పెరిగింది, కానీ జీతాలు 2% మాత్రమే పెరిగాయి. ఇది అన్యాయం!‘ అని తన స్పీచ్‌కు రెడీ అయ్యాడు.

దద్దరిల్లిన పారల్మెంట్‌..
స్పీకర్‌ చైర్‌లో కూర్చుని, లోక్‌సభ గ్యాలరీలు నిండినప్పుడు, యువ ఎంపీ లేచి మాట్లాడాడు. ‘ప్రధాని గారు, మీరు ’వికసిత్‌ భారత్‌’ చెప్తున్నారు. కానీ సామాన్యుడి జీవితం ఎందుకు కష్టమవుతోంది? 28 రోజుల రీచార్జ్‌ పేరుతో రూ.350–400 తీసుకుంటున్నారు. కాల్‌ ప్యాక్‌ ముగిస్తే సేవలు ఆపేస్తున్నారు.. ఇది సరైన పద్ధతా?‘అని నిలదీశాడు. దీంతో మోదీ ముఖం మారిపోయింది. నిర్మలా సీతారామన్‌ మెల్లగా తప్పించుకున్నారు. అయినా యువ ఎంపీ ఆగలేదు.

కీలక అంశాలు ప్రస్తావన..
‘బ్యాంకులు ఏఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కనీస బ్యాలెన్స్‌ లేకపోతే రూ.500 పెనల్టీ, ఇతర ఏటీఎంలలో రూ.25, ఎస్‌ఎంఎస్‌కు రూ.60, స్టేట్‌మెంట్‌కు రూ.100 రూపంలో బ్యాంకులు కస్టమర్ల నుంచి రూ,3,500 వసూలు చేసినట్లు తెలిపారు.

మంత్రుల సమాధానాలు..
మోడీ లేచి, ‘అమృత్‌ కాలంలో జీడీపీ 8% పెరిగింది. పన్ను ఉపశమనాలు ఇచ్చాం‘ అని చెప్పారు. కానీ యువ ఎంపీ తన ప్రసంగం కొనసాగించాడు. ఎమ్మెల్యేలకు నెలకు రూ.9 వేల ఫోన్‌ బిల్లు చెల్లింపులో రూ.8,650 ప్రజలే భరిస్తున్నారన్నారు. రూ.350తో నెలంతా అన్‌ లిమిటెడ్‌ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ వస్తున్నాయి. అలాంట్పుడు రూ.8,650 ఎటు పోతున్నాయని నిలదీశారు.

స్పీచ్‌ తర్వాత, #YouthMPVsModi ట్రెండింగ్‌ అయింది. రాసపూడిపాలెం ప్రజలు టీవీల ముందు చప్పట్లు కొట్టారు. మోదీ, నిర్మలా సీతారామన్‌ ‘ముఖంపై నెత్తురు లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి యువకులు ఎంపీలు అయితే అనేక అంశాల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.

 

View this post on Instagram

 

A post shared by Raghav Chadha (@raghavchadha88)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper