యుపి మంత్రులకు వర్క్ ఫ్రం హోమ్

ఇప్పుడు వరకు ఉద్యోగులకే పరిమితమైన వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో మంత్రులకు కూడా విస్తరిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులంతా సచివాలయానికి రాకుండా… ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో ఇచ్చిన పార్టీకి యూపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ హాజరుకావడంతో… ఇప్పుడు […]

Written By: Neelambaram, Updated On : March 21, 2020 3:30 pm
Follow us on

ఇప్పుడు వరకు ఉద్యోగులకే పరిమితమైన వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో మంత్రులకు కూడా విస్తరిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులంతా సచివాలయానికి రాకుండా… ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో ఇచ్చిన పార్టీకి యూపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ హాజరుకావడంతో… ఇప్పుడు ఆయన స్వయంగా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. మరోవైపు, కరోనా విస్తరించకుండా యూపీ ప్రభుత్వం పలు చర్యలను చేపడుతోంది.

పేద ప్రజల బాధను అర్థం చేసుకొని వారికి నిత్యావసరాల కోసం రూ. 1000 సాయం ప్రకటించారు. యూపీలోని రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు రోజుకు రూ. 1000 ఆర్థిక సాయం చేయనున్నట్లు ఆదిత్యానాథ్ తెలిపారు. ఈ సాయం వల్ల దాదాపు 15 లక్షల మంది రోజువారి కార్మికులు, 20.37 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు.

అంతేకాకుండా.. 1.65 లక్షల కుటుంబాలకు ఒక నెల ధాన్యం ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు వెంటనే వేతనాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. పెన్షనర్లకు ఏప్రిల్ నెలలో ఒకేసారి రెండు నెలల పెన్షన్ ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని బిపిఎల్ కుటుంబాలకు ప్రభుత్వం తరపున 20 కిలోల గోధుమలు, 15 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో దేనికీ కొరత లేదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

కరోనా వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఆర్థికసాయం ప్రకటించలేదు. కానీ.. యోగీ మాత్రం యూపీ ప్రజల కోసం ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీలో ఇప్పటివరకు 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో 9మంది రికవరీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.