‘ఫోన్‌పే’ యూజర్ల తప్పని పాట్లు

ప్రస్తుత కాలంలో ప్రతీఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిందో ఇట్టే తెలుసుకునే సదుపాయం కలిగింది. అరచేతిలో పట్టే స్మార్ట్ ఫోన్ తో కూర్చొన్న చోటు నుంచే ఎన్నోరకాల పనులను చేసుకోవచ్చు. బ్యాంకు లావాదేవీలు కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. బ్యాంకులకు వెళ్లకుండానే పనులు జరిగిపోతుండటంతో ఖాతాదారులు, యూజర్లు వీటిని బాగా వినియోగిస్తున్నారు. అయితే తాత్కలికంగా ఫోన్‌పే..సర్వీస్‌కు బ్రేక్‌ పడింది. దీంతో ఫోన్‌పే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. […]

Written By: Neelambaram, Updated On : March 7, 2020 12:55 pm
Follow us on

ప్రస్తుత కాలంలో ప్రతీఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిందో ఇట్టే తెలుసుకునే సదుపాయం కలిగింది. అరచేతిలో పట్టే స్మార్ట్ ఫోన్ తో కూర్చొన్న చోటు నుంచే ఎన్నోరకాల పనులను చేసుకోవచ్చు. బ్యాంకు లావాదేవీలు కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. బ్యాంకులకు వెళ్లకుండానే పనులు జరిగిపోతుండటంతో ఖాతాదారులు, యూజర్లు వీటిని బాగా వినియోగిస్తున్నారు. అయితే తాత్కలికంగా ఫోన్‌పే..సర్వీస్‌కు బ్రేక్‌ పడింది. దీంతో ఫోన్‌పే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా ‘యస్ బ్యాంక్’పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో బ్యాంకు లావాదేవీలు పరిమితంగా జరుగుతున్నాయి. ఈ ప్రభావం ‘ఫోన్‌పే’పై పడింది. ఎందుకంటే ‘ఫోన్‌పే’కు అతిపెద్ద పేమెంట్‌ భాగస్వామిగా ‘యస్‌ బ్యాంక్‌’ కొనసాగుతోంది.గత రెండురోజులుగా ఫోన్ పే యూజర్లు లావాదేవీలు చేయడానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యస్‌ బ్యాంక్‌ నోడల్‌ అకౌంట్స్‌ పని చేయకపోవడంతో లావాదేవీలు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో యస్ బ్యాంక్ ఖాతాదారులతోపాటు ‘ఫోన్‌పే’ యూజర్లు లావాదేవీలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

దీనిపై స్పందించిన ‘ఫోన్‌పే’ యూజర్లకు క్షమాపణలను చెప్పింది. తమ సేవలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. యస్ బ్యాంక్ పై ఆర్బీఐ మాటిరిటోరియం విధించడం వల్ల బ్యాంక్ షేర్లు ఇప్పటికే 85శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యస్ బ్యాంక్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.