spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Split Votes: కాపులు, క్షత్రియులను చీల్చే కుట్ర.. జనసేన వైపు వెళ్లకూడదనే..

YCP Split Votes: కాపులు, క్షత్రియులను చీల్చే కుట్ర.. జనసేన వైపు వెళ్లకూడదనే..

YCP Split Votes: వైసీపీ వ్యూహం మార్చిందా? కాపులు, క్షత్రియుల్లో విభజనకు తెరలేపిందా? ఓటు చీలికతోనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కగలనని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు చీలిపోనివ్వనని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన చర్యలు ఉన్నాయి. అయితే పవన్ రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించాలని వైసీపీ ప్లాన్ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కాపుల్లోని ఉప కులాలను, క్షత్రియ సామాజికవర్గంలో చీలికి తెచ్చి ప్రయోజనం పొందాలని భావిస్తోంది.

గోదావరి జిల్లాల్లో..
ఏపీలో అధికారంలో రావాలంటే ఉభయ గోదావరి జిల్లాలు కీలకం. అక్కడ గెలుపొందాలంటే కాపులు, క్షత్రియుల మద్దతు అవసరం. అయితే ఆ రెండు వర్గాలు జనసేన వెంట ఉన్నాయి. వాటిలో చీలికి ఎలా తేవాలన్నదానిపై వైసీపీ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే కాపుల ఉప కులాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాపుల్లో బలిజ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి పేరిట ముందుకెళుతోంది. వారి అభిమానాన్ని చూరగొనాలని చూస్తోంది.

బలిజలపై ఫోకస్..
ఇప్పటికే బలిజలకు రాజకీయ ప్రాధాన్యమిచ్చిన జగన్.. కాపుల నుంచి వేరుచేసే ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బలిజలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనున్నారు. దీంతో కాపుల్లో 30 నుంచి 40 శాతంగా ఉన్న బలిజల ఓట్లు తమకు పడేలా చూసుకునేందుకు ప్లాన్ రూపొందించినట్టు సమాచారం. ఇక మిగిలిన వారిలోనూ 20 నుంచి 40 శాతం ఓట్లు తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం వేస్తే.. తిరుగు లేదనే అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది. మొన్న ఆ మధ్యన కాపులతో తమ ప్రయోజనాలు గండిపడుతున్నాయన్న అభిప్రాయం వచ్చేలా ఒకరిద్దరు బలిజ నాయకులతో వైసీపీయే మాట్లాడించిందన్న ప్రచారం ఉంది.

రాజుల ఆగ్రహం..
అటు క్షత్రియ సామాజికవర్గం నుంచి ఎదురయ్యే ప్రతికూలతను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజులను జగన్ సర్కారు ఏ స్థాయిలో వేధించిందో అందరికీ తెలిసిందే. దీనిని క్షత్రియ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. మంత్రివర్గ విస్తరణలో ఉన్న ఒక్కగానొక్క పదవి తొలగించేసరికి ఆగ్రహంగా ఉంది దీంతో తమకు ప్రతికూలత తప్పదని భావిస్తున్న వైసీపీ బీజేపీలోని క్షత్రియ సామాజికవర్గ నేతలతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ఆ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper