‘మందేస్తూ.. చిందేయ్ రా.. చిందేస్తూ మందేయ్ రా’ అంటూ వైసీపీ నేతలు సంతోషంతో స్టెప్పులేశారు. అయితే వారి ఇంట్లోనో.. ఫాంహౌస్ లోనో వేస్తే ఎవ్వరికీ తెలిసేది కాదు..కానీ పబ్లిక్ గా ఆ పాడు పనిచేశారు. రికార్డింగ్ డ్యాన్సర్లు అయిన అందమైన అమ్మాయిలను పెట్టి వైసీపీ నేతలు రాత్రి డ్యాన్సులు, రోమాన్సులతో హోరెత్తించారు.
గుంటూరు జిల్లా క్రోసూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రాత్రి స్థానిక వైసీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సర్ల అయిన అమ్మాయిలను తీసుకొచ్చి పాటలు, డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ వీడియోను కొందరు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
విశేషం ఏంటంటే.. చేసింది పాడు పని అయిన సరే వెనుకాల ఫ్లెక్సీలో సీఎం జగన్ ఫొటో పెట్టడమే ఇప్పుడు వైసీపీకి మింగుడుపడని వ్యవహారంగా మారింది. నిబంధనలు అతిక్రమించి వ్యవసాయ మార్కెట్ యార్డులో వైసీపీ నేత షేక్ గనీ పుట్టినరోజు సందర్భంగా ఈ ఎంజాయ్ మెంట్ రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతల్లో కొందరు డ్యాన్సర్లతో కలిసి చిందులేశారు.
అయితే క్రోసూరులో ఇంత హోరెత్తిస్తున్నా.. విందు వినోదాలు, రికార్డింగ్ డ్యాన్సులతో చిందేస్తున్నా కానీ పోలీసులు అటువైపు చూడకపోవడం విమర్శలకు తావిచ్చింది. బహుశా అధికార పార్టీ నేతలా? అని వదిలేశారా? అని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.