లాక్ డౌన్ డబ్బులు వచ్చాయా..? చెక్ చేసుకోండి!

దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు మోదీ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. దీని వల్ల కూలి పని చేసుకుంటూ ఉన్న పేద కుటుంబాలపై ఎక్కువ ప్రభావం పడుతోంది. అందుకే వీరి కోసం కేంద్ర ప్రభుత్తం పలు చర్యలు తీసుకుంది. నగదు బదిలీ కూడా వీటిల్లో ఒక భాగంగానే చెప్పుకోవచ్చు. ప్రతి నెలా 3 నెలల పాటు జన్ ధన్ ఖాతా కలిగిన మహిళలకు రూ.500 అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 2:05 pm
Follow us on

దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు మోదీ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. దీని వల్ల కూలి పని చేసుకుంటూ ఉన్న పేద కుటుంబాలపై ఎక్కువ ప్రభావం పడుతోంది. అందుకే వీరి కోసం కేంద్ర ప్రభుత్తం పలు చర్యలు తీసుకుంది. నగదు బదిలీ కూడా వీటిల్లో ఒక భాగంగానే చెప్పుకోవచ్చు. ప్రతి నెలా 3 నెలల పాటు జన్ ధన్ ఖాతా కలిగిన మహిళలకు రూ.500 అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే ప్రకటించారు.

ఏప్రిల్ 3 అంటే ఈ రోజు నుంచే మొదటి విడతగా మహిళల జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తాయి. రూ.500 ఈరోజు ఖాతాల్లో జమవుతుంది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఈ విషయమై ఆదేశాలు జారీ చేసింది. తొలి విడత డబ్బులు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 మధ్యలో అన్ని అకౌంట్లలోనూ జమవుతుంది.జన్ ధన్ అకౌంట్ నెంబర్ చివరిలో 0 లేదా 1 ఉంటే వారికి ఈ రోజే డబ్బులు వచ్చేస్తాయి. అకౌంట్ నెంబర్ చివరిలో 2 లేదా 3 ఉంటే ఏప్రిల్ 4న, 4 లేదా 5 ఉంటే ఏప్రిల్ 7న, 6 లేదా 7 ఉంటే ఏప్రిల్ 8న, ఇక 8 లేదా 9 ఉంటే ఏప్రిల్ 9న రూ.500 డబ్బులు అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి.

కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు ఇప్పటికే 2,500 పైకి చేరాయి. అంతర్జాతీయంగా 10 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. 53 వేల మందికి పైగా కోవిడ్ 19 వల్ల మరణించారు.