Rahul Gandhi Great Nicobar visit: నేడు పర్యావరణ దినోత్సవం. ధరిత్రిని కాపాడాలని.. పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలని ప్రతి ఒక్కరూ ప్రతీన బూనుతున్నారు. పర్యావరణాన్ని కాపాడతామని చెబుతున్నారు. ఇదే సమయంలో దేశ ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ ఒక వీడియోను విడుదల చేశారు.అంతేకాదు, సంచలన విషయాలను బయట పెట్టారు.
రాహుల్ గాంధీ ఉన్నట్టుండి గ్రేట్ నికోబార్ వెళ్లారు. ఆయన వెంట కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యారవణ విధ్వంసాన్ని రాహుల్ గాంధీ వివరించారు. సముద్రంలోకి వెళ్లి అక్కడి మత్స్య సంపదను చూశారు. చూడటం మాత్రమే కాదు, దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు.
నరేంద్రమోడీ ఓ వ్యాపారవేత్త కోసం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రేట్ నికోబార్ ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త హోటళ్లు,కాసినోలు నిర్మిస్తున్నారని, దీనికోసం కోటిన్నర చెట్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ఆ వ్యాపారవేత్త పేరు చెప్పకుండా రాహుల్ గాంధీ మార్మికతను ప్రదర్శించారు. అయితే ఇదంతా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు రక్షణ అవసరాల కోసమని మోడీ చెబుతున్నారని.. అది నిజం కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఐఎన్ఎస్ భజరంగ్ కోసం ఇదంతా చేస్తే మాత్రం తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
గ్రేట్ నికోబార్ అనేది అందమైన సముద్రప్రాంతం. ఇక్కడి తీరం అత్యంత విస్తారమైనది. అరుదైన జంతువులు ఇక్కడ అనేకం ఉంటాయి. సముద్ర జంతువులు, శైవలాలు,నాచు, చెట్లు విస్తారంగా ఉంటాయి. మాంగ్రూవ్ చెట్లు ఇక్కడి తీరాన్ని కాపాడుతూ ఉంటాయి. దేశ రక్షణ కోసం ఐఎన్ఎస్ భజరంగ్ ను కేంద్రం ఇక్కడి నిర్మిస్తున్నామని చెబుతోంది. దీనిపై రాహుల్ గాంధీ వాదన మరో విధంగా ఉంది. రాహుల్ గాంధీ కీలకమైన వీడియో విడుదల చేసిన నేపథ్యంలో బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఒకవేళ బీజేపీ గనుక వివరణ ఇస్తే అప్పుడు ఈ వ్యవహారం మరింత రంజుగా మారుతుంది.
