Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: కొడాలి నాని సైలెంట్.. గుడివాడకే పరిమితమైన వైసీపీ ఫైర్ బ్రాండ్

Kodali Nani: కొడాలి నాని సైలెంట్.. గుడివాడకే పరిమితమైన వైసీపీ ఫైర్ బ్రాండ్

Kodali Nani: మేము జగన్ నుంచి గ్యారేజీ నుంచి వచ్చాము. మాకు పదవులతో పనిలేదు. మాకు పదవే అడ్డంకి. అదే లేకుంటే వీరవిహారం చేస్తాం.. ఈ మాటలన్నది ఎవరో తెలుసా తాజా మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు. ఒక విధంగా చెప్పాలంటే వీరు శాఖాపరమైన ప్రగతితోనే ప్రాచుర్యం పొందలేదు. వారి నోటి నుంచి వచ్చే మాటల తూటాలు, వివాదాస్పద వ్యాఖ్యలతోనే గుర్తింపు పొందారు. సొంత పార్టీ వారు వీరిని ఫైర్ బ్రాండ్లుగా అభివర్ణించేవారు. విపక్ష నేతలు బూతుల మంత్రులుగా చెప్పుకునేవారు. ఏ పార్టీతో సంబంధం లేని తటస్థులు, విద్యాధికులు మాత్రం వీరి మాటలను ఏవగించుకునేవారు.

Kodali Nani
Kodali Nani

మంత్రి పదవులు ఉన్న సమయంలో తెగ హడావుడి చేసే వీరిద్దరూ ఇటీవల సైలెంట్ అయిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ కాస్తో కుస్తో జిల్లా మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డిని ఇబ్బందిపెట్టే పనిలో ఉన్నా.. కొడాలి నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు. మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోయే సమయంలో సైతం కొడాలి నాని చాలా క్యాజువల్ గా కనిపించారు. తమకు పదవులు త్రుణప్రాయంగా చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా సమర్థులకు పెద్దపీట వేయడానికే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ అంటూ మీడియా ముందు బడా ప్రకటనలిచ్చారు. అప్పటివరకూ తొలగింపు జాబితాలో తనపేరు ఉండదని బహుశా ఈ ప్రకటన ఇచ్చి ఉంటారు. అంతటితో ఆగకుండా తమకు పదవులు పోయిన పర్వాలేదని.. అధినేత ఇచ్చిన టాస్క్ ను పూర్తిచేస్తామని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి తన దూకుడుగా అడ్డమని.. అదే లేకపోతే ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తామని తెగ బిల్డప్ ఇచ్చారు. అయితే ఇది జరిగి సరిగ్గా రెండు వారాలైనా కాలేదు.. ఈ తాజా మాజీ మంత్రి మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. విపక్ష నేతలపై తూలనాడడాన్ని అత్యంత వెన్నతో పెట్టిన విద్యగా భావించే కొడాలి నాని నోటికి తాళం పడడం వెనుక పెద్ద కారణాలే నడుస్తున్నాయన్న టాక్ వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది.

Also Read: Prashant Kishor: పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా?

తత్వం బోధపడిందా?
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ప్రభుత్వంపై చిన్న విమర్శ చేసినా సహించలేని నాని చిందులేసేవారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేవారు. కానీ పదవి పోయే సరికి తాను అన్న మాటలు గుర్తొచ్చినట్టున్నాయి. అందుకే గుడివాడకు పరిమితమయ్యారని తెలుస్తోంది. అయితే ఈ సైలెంట్ వెనుక చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని నాని భావించలేదు. కమ్మ సామాజికవర్గంలో చంద్రబాబుకు దీటుగా తానే ఉన్నానని..తనను తప్పించే సాహసం చేయరని..పైగా తాను జగన్ కు భక్తుడ్ని కానుక టచ్ చేయరని చాలా నమ్మారు.

Kodali Nani
Kodali Nani

ఒకరిద్దరు మంత్రుల ను కొనసాగిస్తే.. అందులో తాను ఒకరినని అనుచరుల వద్ద గొప్పగా చెప్పుకున్నారు. కానీ తానొకటి తలస్తే.. జగన్ ఒకటి తలచారని.. మంత్రి నుంచి ఊస్టింగ్ చేశారని తెగ బాధపడుతున్నారు. పైగా కమ్మ సామాజికవర్గం నుంచే ప్రాతినిధ్యం లేకుండా చేశారని ఆక్రోషిస్తున్నారు. ఇది తనకు పొలిటికల్ గా దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కమ్మల ప్రాభల్యం ఎక్కువ. వారికి టీడీపీపై అభిమానం ఉన్నా.. తమ సామాజికవర్గానికి చెందిన నానిని సైతం గెలిపించుకుంటూ వస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నాని వ్యవహార శైలి వారికి నచ్చడం లేదు. ఇప్పుడు ఏకంగా కులానికి ప్రాతినిధ్యం లేకుండా పోయిందని వారు కుతకుతలాడుతున్నారు. అందుకే వారంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించడానికి నిర్ణయించుకున్నారు. అది తెలిసే నాని తెగ బాధపడిపోతున్నారు. అనవసరంగా లేనిపోని వివాదాల్లో దూరి కోరి కష్టాలు తెచ్చుకున్నానని అనుచరుల వద్ద తన ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఇక నుంచైనా కొడాలి నాని వెనక్కి తగ్గుతారో.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలిచి మంత్రినవుతానంటూ రంకెలు వేస్తారో చూడాలి.

Also Read:TDP Mahanadu 2022: మహానాడుకు అన్నగారి కుటుంబసభ్యులు… జూనియర్ ఎన్టీఆర్ పైనే చంద్రబాబు ఫోకస్

Recommended Videos:

Actress Kajal Aggarwal Son Name || Gautam Kitchlu Announced Baby Boy Name || Oktelugu Entertainment

Balayya Heroine Sonal Chauhan seen at Mumbai Airport Arrivals || Oktelugu Entertainment

Ram Charan Shares A Funny Fight Between His Mother and Grand Mother || Oktelugu Entertainment

4 COMMENTS

  1. […] PM Modi Jammu Kashmir Visit: జమ్ము కశ్మీర్ పై ప్రధానమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రగతిపై పట్టు సాధిస్తున్నారు. జమ్ముకశ్మీర్ ను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత పాలకుల వలె కాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. అందుకే రాష్ట్రాన్ని అన్ని దారుల్లో ముందుకు తీసుకెళ్లడానికే ప్రాదాన్యం ఇస్తున్నారు. ఏ నాయకుడు చేయలేని పని చేస్తూ అక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. పలితంగా సమస్యల పరిష్కారంపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు ప్రజల సుఖసతోషాలే ఎజెండాగా పనులు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా నిస్సహాయత నిస్ర్పహలు దూరమవుతున్నాయి. […]

  2. […] KTR- BJP- Congress:  రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి రెండు రోజుల క్రితం వరంగల్‌ పర్యటనలో చేసిన దుర్బాషలు, తిట్ల పురాణ సంభాషణపై ప్రతిపక్షాలు కౌంటర్‌ ఎటాక్‌ షురూ చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడిన కేటీఆర్‌ను ఇప్పుడు అంతే వేగంగా.. అదే పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కేటీఆర్‌తోపాటు కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నాయి. […]

  3. […] Prashant Kishor- YCP: ఏపీలో వైసీపీకి అంతులేని విజయాన్ని సాధించిపెట్టారు ప్రశాంత్ కిశోర్. వ్యూహకర్తగా వైసీపీని అధికారంలోకి తేవడానికి ఎంతో దోహదపడ్డారు. ఇప్పటికీ తన ఐప్యాక్ టీమ్ ద్వారా పార్టీకి సేవలందిస్తున్నారు. అయితే ఆయన ఇటీవల చేసిన పొత్తుల ప్రకటన, ప్రతిపాదనలు ప్రకపంనలు రేపుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తు అవసరమని.. ఏపీలో వైఎస్సార్ సీపీతో పొత్తు ఉభయ పార్టీలకు ఉభయతారకంగా ఉంటుందని పీకే కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. రాజకీయవర్గాల్లో కూడా ఆసక్తిని రేపాయి. రాజకీయంగా బలంగా ఉన్న జగన్ కాంగ్రెస్ తో కలుస్తారా? రాజకీయంగా సమాధి చేసిన జగన్ తో కలవడానికి కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతుందా? అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. బలం, బలహీనత అన్న మాట కాకుండా అవసరమే ఇప్పుడు ఆ రెండు పార్టీలను కలుపుతుందన్న వాదనా వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వరుసగా అంతులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. విపక్ష నేతలను దారికి తెచ్చుకునేందుకు కేసులను బూచీగా చూపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది. […]

Comments are closed.

Exit mobile version