Homeఆంధ్రప్రదేశ్‌పేదలపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు? పవన్ కల్యాణ్ ప్రశ్న

పేదలపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు? పవన్ కల్యాణ్ ప్రశ్న

Pawan Kalyanఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ రాకతో భవన నిర్మాణ రంగ కార్మికులు, నిరుద్యోగులు, తాడేపల్లి కరకట్ట వాసులు తమ గోడు విన్నవించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిగింది. ఇందులో రాష్ర్టంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. పార్టీలో పనిచేస్తూ కరోనా బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేశారు.

ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేందుకు పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు.

కార్మికుల కష్టాలు తెలుసుకున్న పవన్ కల్యాణ్ వారి సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సీఎం ఇంటి భద్రత పేరుతో పేదల ఇళ్లు ఖాళీ చేయించడం దారుణమన్నారు. తాడేపల్లి కరకట్ట వాసులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అధికారుల తీరుపై ఆక్షేపణ చేశారు. ఈ నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు.

అర్తరాత్రి పేదల ఇళ్లపై పొక్లెయిన్లు పంపిస్తున్నారని అన్నారు. ఇదేంటని అడిగితే బూతులు తిడుతున్నారని విమర్శించారు. ముప్పై ఏళ్ల నుంచి తాము అక్కడే జీవిస్తున్నామని చెప్పినా నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే ముందే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం నివాసం భద్రత పేరుతో కార్మికులను బెదిరించడం బాగా లేదని నిరసన తెలిపారు.

జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించే వరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారి ఇళ్లను ఖాళీ చేయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఏం పాపం చేశారని విమర్శించారు. అయినా సీఎం పరిపాలన రాజధానికిగా విశాఖను చేసుకుంటే తాడేపల్లిలో ఇళ్లను ఖాళీ చేయించడం ఎందుకని ప్రశ్నించారు. దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version