Bandi Sanjay or Revanth Reddy : తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. తెలంగాణలో ఉన్నన్నీ పార్టీలు, నేతలు ఆంధ్రాలో లేరు. తెలంగాణలో ఇన్నాళ్లు ఎదురేలేకుండా అప్రతిహతంగా సాగిన టీఆర్ఎస్ ను ఓడించి దుబ్బాక ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రజల ఫోకస్ అంతా తనవైపు మలుచుకుంది.
ఈ ఎపిసోడ్ తర్వాత చచ్చుబడిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపుతూ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం కావడం ఆ పార్టీలో జోష్ పెంచింది. వీళ్ల మధ్యలో మేమున్నామని చెబుతూ వైఎస్ షర్మి ల పార్టీ తెలంగాణలో హల్ చల్ చేసింది. దానికన్న ముఖ్యంగా.. ఏకంగా ఐపీఎస్ పదవికి రిజైన్ చేసి బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరి కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం తెలంగాణ రాజకీయాలను మునుపెన్నడూ లేనంతా వేడెక్కించాయి. దళితుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు విపరీతమైన ఆదరణ ఉంది. సో ఆయనను తక్కువ అంచనా వేయడానికి లేదు.
వీటన్నింటిలో తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ కు ప్రత్యామ్మాయంగా ఏ పార్టీ ఎదుగుతుంది? అన్నింటిని వడపోస్తే ప్రధానంగా బీజేపీ ఎదుగుతుందా? లేక రేవంత్ రెడ్డి ముందుకొస్తాడా? ఎవరిది పైచేయి కానుంది? తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ బలాబలాలపై స్పెషల్ ఫోకస్ వీడియో..