Homeజాతీయ వార్తలువ్యాక్సిన్ పనిచేస్తుందా? వేసుకోవచ్చా.? వేసుకోరాదా?

వ్యాక్సిన్ పనిచేస్తుందా? వేసుకోవచ్చా.? వేసుకోరాదా?

దేశమంతా వ్యాక్సినేషన్ జరుగుతోంది. మొదటి వైద్య సిబ్బందికి.. ఆ తర్వాత 45 ఏళ్ల పైన వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటికే దేశమంతా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ వికటించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. భయపడుతున్నారు. ఈ క్రమంలోనే  వ్యాక్సిన్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? ఏ విధంగా తయారు చేస్తారు, మనం తీసుకోబోయేది ఏ విధంగా తయారు చేశారు,? మన శరీరం నిర్మాణంపై స్పెషల్ ఫోకస్. కరోనా వ్యాక్సిన్ ప్రభావం అనేది మన హెల్థ్ ప్రొఫైల్ లాంటి చాలా విషయాల మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా నిజమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే సాధారణంగా వ్యాధినిరోధక కణాలు (యాంటీ బాడీస్) ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ ని నిర్వీర్యం చేస్తాయి. చేయని సమక్షంలో లేదా యాంటీ బాడీస్ తక్కువ ఉన్న సందర్భం లో మనకి ఆ వైరస్ వలన కలిగే వ్యాధి వస్తుంది, అప్పుడు ఆ వ్యాధి ని నిరోధించటానికి మన శరీరంలోని శక్తి సరిపోలేదు కాబట్టి యాంటీ వైరల్ డ్రగ్స్ లేదా ఇంకేవో వాడాల్సి వస్తుంది. ఇంకా ఏదైనా వ్యాధి రాగానే మనకి యాంటీ బాడీస్ అసలు లేవు లేదా తక్కువ ఉన్నా వ్యాధిని కలుగచేస్తుంది.. ఒకేసారి మన మొఖం మీద గట్టిగా తుమ్మిన ఎదుటి వ్యక్తికి కరోనా ఉండి ఉంటే ఒకేసారి లక్ష లేదా 4 లక్షల వైరస్ లు ప్రవేశిస్తే మన యాంటీ బాడీస్ సరిపోక వ్యాధి ముదరవచ్చు.  ఆ తర్వాత కొన్ని రోజులకి అదే తగ్గిపోవచ్చు లేదా ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి రావొచ్చు.

*ఇంకా వ్యాక్సిన్ విషయానికొస్తే..

వ్యాక్సిన్ అంటే మందు కాదు. వ్యాక్సిన్ ని 5-8 రకాలుగా తయారు చేస్తారు. నిజమైన వైరస్ ని తీసుకొని దాన్ని ఫార్మాల్డిహైడ్ లాంటి వాటిని వేసి చంపి, చంపిన వైరస్ ని శరీరం లోకి ప్రవేశ పెడితే నిజమైన వైరస్ వచ్చింది అనుకొని మన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. కొన్ని సార్లు సింగిల్ వైరస్ ని, మరికొన్ని సార్లు కీడు చేసే జీన్స్ ని తొలగించి బతికున్న వైరస్ నే వ్యాక్సిన్ గా ఇస్తారు. మరికొన్ని సార్లు హానికరమైన వైరస్ జీన్స్ ప్రదేశం లో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి మిగతాది అంతా వైరస్ జీన్స్ నే ఉంచి రీ కాంబినెంట్ టెక్నాలజీ ద్వారా చేసిన వైరస్ ని ఎక్కిస్తారు. ఈ విధం గా చాలా రకాలుగా వ్యాక్సిన్ ని తయారు చేస్తారు.

కరోనా వైరస్ కి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ అనేది కరోనా వైరస్ ని తీసుకొని దాన్ని చంపి, చనిపోయిన కరోనా వైరస్ ని ఇంజెక్షన్ రూపం లో ఇస్తున్నారు. ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవీషీల్డ్ అనేది కరోనా వైరస్ లాగా ఉండే ఎడినో వైరస్ ని తీసుకొని రీ కాంబినెట్ టెక్నాలజీ ద్వారా చేసిన వ్యాక్సిన్ అది. చనిపోయిన కరోనా వైరస్ ఎక్కించినా, ఎడినో వైరస్ తో చేసిన వ్యాక్సిన్ ఎక్కించినా శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి.

ఈ రెండు మాత్రమే ఇండియా లో ఎక్కువ లభ్యమవుతున్నై కాభట్టి వీటి గురించి ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకోవాలి.

మరి 100% పనిచేస్తాయా..? వాళ్ళు చేసిన క్లినికల్ ట్రయిల్స్ ప్రకారం 62% ఎఫెక్టివ్, 90% ఎఫెక్టివ్, 70% ఎఫెక్టివ్ ఇలా ఇచ్చారు. దాని అర్ధం వాళ్ళు క్లినికల్ ట్రయిల్స్ చేసినప్పుడు 100 మందికి ఇస్తే 70 మందిలో మాత్రమే యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయి అని అర్ధం. సో ఏదీ 100% వర్క్ అవుట్ కాదు. మనకి పని చేయొచ్చు, చేయకపోవచ్చు.

వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా వచ్చింది, దీని అర్ధం ఏమిటి..? ఇక్కడ 2-3 కారణాలు ఉంటే. 1. ఆ వ్యాక్సిన్ మనకి ఎఫెక్టివ్ కాదు 2. వ్యాక్సిన్ సమర్ధవంతమైనదే కాని మనలో కొన్ని కారణాల వలన యాంటీబాడీస్ కాంప్రమైజ్ అయ్యి ఉత్పత్తి అవ్వలేదు 3. యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయి కాని కొన్ని రోజులే ఉండి అ తర్వాత ఎవరినుంచో కరోనా వచ్చింది.ఈ విధం గా చాలా ఉంటాయి.

వైరస్ విషయానికొస్తే.. ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి..? భారత్ బయోటెక్ ది ఏమో చనిపోయిన వైరస్ ని ఎక్కిస్తున్నారు. ఆస్ట్రాజెనికా కోవీషీల్డ్ ఏమో ఎడినో వైరస్ నుంచి తయారు చేసినది. ఏ ఇతర జబ్బులు ఉన్నా 97% భారత్ బయోటెక్ కొవాక్సిన్ వేసుకోవచ్చు. కారణం ఆ ఇంజెక్షన్ వేసాక పెద్దగా రియాక్షన్స్ ఏమీ జరగవు. ఒక చనిపోయిన వైరస్ ని చూసి నిజమైన వైరస్ అనుకొని యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయితే అత్యంత పెద్ద జబ్బులు ఉన్నవారికి ఏమైనా అవుతుందా అనేది సరైన నిపుణులని అడిగి తెలుసుకోవాలి. కాని సాధారణం గా అందరూ తీసుకోవచ్చు.

అయితే కొవాక్సిన్ తీసుకున్నా, కోవీషీల్డ్ తీసుకున్నా మొదలు అవి సమర్ధవంతంగా మనకి పనిచేస్తాయా లేవా అనే గ్యారంటీ అయితే లేదు, ఇంకా వ్యాక్సిన్ సమర్ధవంతంగా ఉండి యాంటీ బాడీస్ ఉత్పత్తి అయినా అవి ఎల్లకాలం ఉండే అవకాశం అందరికీ ఉండవు.

మరి ఇంకేదో వైరస్ కి వ్యాక్సిన్ తీసుకుంటే దానికి సంబంధించిన వ్యాధి ఇన్ని సంవత్సరాలు అయినా రాలేదు, అది 100% పనిచేసింది కదా మరి కరోనా వైరస్ కి ఎందుకు అలా జరగదు అంటే… వేరే వైరస్ కి మనం వ్యాక్సిన్ తీసుకున్నం ఆ రోజుల్లో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయి, దానికి సంబంధించిన యాంటీ బాడీస్ మన శరీరం లో లేకపోయినా ఇప్పుడు ఆ వైరస్ బయట లేదు; కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రతి జిల్లా లో ఉంది,

అందుకే అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి . మరీ అతి పెద్ద వ్యాధులు, కండీషన్స్ ఉన్న వాళ్ళు మినహా అందరూ తీసుకుంటే ఆ వైరస్ ని పూర్తిగా పారద్రోలవచ్చు. ఆ తర్వాత యాంటీ బాడీస్ ఉత్పత్తి కాకపోయినా, ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ నిర్వీర్యం అయినా ఏమీ కాదు.

కరోనా వైరస్ ప్రపంచం నుంచి వెళ్ళిపోయేవరకు ఖచ్చితం గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనదేశం లో పూర్తిగా పోయినా ఎక్కడో ఒక దేశం లో ఉంటే ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ వ్యాపిస్తుంది; అందుకే ఇంకో సంవత్సరం వరకు అందరూ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వ్యాక్సిన్ సర్వరోగ నివారణి కాకపోవచ్చు, కానీ చాలా ఉపయోగం ఉంది. వీలైనంత త్వరగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి, మరియు జాగ్రత్తలు పాటించాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular