Warner Bros: వంద సంవత్సరాల చరిత్ర కలిగిన వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ కంపెనీ హైదరాబాద్ లో అడుగుపెట్టనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వార్నర్ బ్రదర్స్. డిస్కవరీ హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నారు. వార్నర్ బ్రదర్స్. డిస్కవరీ ప్రతినిధులతో కేటీఆర్ ఒప్పందం చేసుకున్నారు. వారితో భేటీకి సంబంధించిన ఫోటోలు ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ అమెరికా వెళ్లారు. అమెరికన్ ప్రొడక్షన్ హౌస్ వార్నర్ బ్రదర్స్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ లో తమ సంస్థను ఏర్పాటు చేసేలా ఒప్పించారు. మొదటి దశలో వార్నర్ బ్రదర్స్. డిస్కవరీ 1200 మంది ఉద్యోగులతో తమ సంస్థను ప్రారంభిస్తుంది. ఎంటర్టైన్మెంట్ రంగంలో హైదరాబాద్ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ ఇప్పటికే విశ్వనగరంగా ఆవిర్భవించింది. సినిమా మేకింగ్ కి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంకేతికత అందుబాటులో ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలు స్టూడియోలు భారీ చిత్రాల నిర్మాణానికి దోహదం చేస్తున్నాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న పలు భారీ చిత్రాల చిత్రీకరణకు హైదరాబాద్ వేదిక కావడం విశేషం.
వార్నర్ బ్రదర్స్. డిస్కవరీ ఎంట్రీతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరగనుంది. ఇక టాలీవుడ్ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇక్కడి టాప్ స్టార్స్ ఇండియా వైడ్ మార్కెట్ సంపాదించారు. ఒక్క ప్రభాస్ చేస్తున్న చిత్రాల బడ్జెట్ రెండు వేల కోట్లు ఉంటుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అప్ కమింగ్ చిత్రాలు ఒక్కోటి మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇక రాజమౌళి-మహేష్ మూవీ రూ. 800 కోట్లకు పైగా ఖర్చుతో రూపొందిస్తున్నారట.
Thrilled to announce the grand entry of global media powerhouse "Warner Bros. Discovery" into the entertainment realm of Telangana!
Hyderabad is set to witness the launch of their incredible IDC, a hub of creativity and innovation, with a whopping 1200 employees in the first… pic.twitter.com/z5hAj5kBNs
— KTR (@KTRBRS) May 17, 2023