ఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh MP Vs SP: ఏకంగా ఎస్పీ స్థలానికే ఎసరు పెట్టిన ఎంపీ.. ఇక...

Andhra Pradesh MP Vs SP: ఏకంగా ఎస్పీ స్థలానికే ఎసరు పెట్టిన ఎంపీ.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో..?

Andhra Pradesh MP Vs SP: ఈమధ్య వైసీపీ నాయకులు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. భారీ పై వస్తున్న ఆరోపణలు, పెడుతున్న కేసులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా భూకబ్జా ఆరోపణలు ఈ మధ్య వైసీపీ అధికార ప్రతినిధులపై చాలా ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏకంగా ఎస్పి కి చెందిన స్థలాన్ని కబ్జా చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పని చేస్తున్న మధు తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఎంపీపై సీపీకి ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh MP Vs SP
Andhra Pradesh MP Vs SP

దీంతో ఈ విషయం ఇప్పుడు అధికార వైసీపీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. పీఎం పాలెం గాయత్రి నగర్ లో వెంచర్ స్టార్ట్ చేసిన సత్యనారాయణ.. అందులోకి వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని నిర్మించారు. రోడ్డు వేసే క్రమంలో ఓ ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించుకుని మరీ కల్వర్టును నిర్మించారు. ఆ స్థలం ఎవరిదో కాదు ఎస్పీ మధు కుటుంబ సభ్యులది. దీంతో వారు మొదట్లో మర్యాదపూర్వకంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంపీ వినకపోవడంతో తప్పక సీపీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఎస్పీ మధు చెబుతున్నారు.

Also Read: Puri Jagannadh Latest Update: బిగ్ అప్ డేట్ కి ఇంకా 14:20 గంటల సమయం ఉంది !

గతంలో కూడా ఎంపీపై అనేక ఆరోపణలు వచ్చాయి. అసలే వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ అధికార ప్రతినిధులు మాత్రం ఇలాంటి కబ్జాలు మానట్లేదు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా ఓ ఎస్పీ స్థలాన్ని కబ్జా చేశారంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎంపీ అయితే మాత్రం ఇలా కబ్జాలు చేసుకుంటూ పోవడం అంటూ అటు ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మరి ఇంత జరుగుతున్నా జగన్ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు. పోనీ ఎస్పీ ఫిర్యాదు ఫేక్ అనుకుంటే.. ఇప్పటికే వైసీపీ ప్రతినిధులంతా రంగంలోకి దిగి నానా రాద్ధాంతం చేసేవారు. కానీ అలా చేయకుండా సైలెంట్ గా ఉన్నారు అంటే ఇది వాస్తవం అనే కదా. తమది ప్రజల పక్షం, పేదల పక్షం అని చెప్పుకునే వైసీపీ నేతలు.. ఇలాంటి కబ్జా వ్యవహారాలపై ఎందుకు స్పందించరు.

తప్పు చేయనప్పుడు భయమెందుకు. అంటే పైన పటారం లోన లొటారం అన్నట్టు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పైకి ఉదారత చూపిస్తున్నా.. లోపల మాత్రం చేసేటివి ఇలాంటి పనులే అన్నమాట. గతంలో కొడాలి నానిపైన ఎన్ని ఆరోపణలు వచ్చాయో చూశాం. కానీ అప్పుడు ఎలాంటి స్పందన చేయని జగన్.. ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా ఏకంగా ఓ ఎఎస్పీ చేసిన ఫిర్యాదుపై ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.

Also Read: Andhra Pradesh MP Vs SP: ఏకంగా ఎస్పీ స్థలానికే ఎసరు పెట్టిన ఎంపీ.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version