ఢిల్లీలో కరోనా కల్లోలం వేళ కారులో బయటకు వచ్చిన ఓ జంట హల్ చల్ చేసింది. వీకెండ్ కర్ఫ్యూ అమలవుతున్న వేళ కారులో రోడ్డెక్కిన ఆ జంట పోలీసులతోనే వాగ్వాదానికి దిగింది. మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు ప్రశ్నించినందుకు వారిపై విరుచుకుపడింది. మమ్మల్నే అడుగుతావా అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఢిల్లీలోని ఘలియా గంజ్ లో మాస్క్ పెట్టుకోకుండా బయట తిరుగుతున్న ఓ జంటను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ జంట కారు దిగి నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. నా భర్తకు నడిరోడ్డుపై ముద్దిస్తా.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ హల్ చల్ చేసింది. కరోనా పేరుతో నాటకాలు చేయొద్దని.. మీ స్థాయిలో ఉండండి అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.
కారులో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలని.. కోర్టు ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నా వినకుండా సదురు మహిళ పోలీసులపైనే రెచ్చిపోయింది. వాగ్వాదానికి దిగింది. మా నాన్న కూడా పోలీసేనంటూ హల్ చల్ చేసింది.
మాస్క్ ల పేరుతో చలానాలు వసూలు చేయడానికి వచ్చారంటూ పోలీసులుపైనే రెచ్చిపోయారు. వారి వద్ద ఎలాంటి మాస్కులు లేకపోవడం.. పోలీసులపైనే ఎదురుతిరగడంతో ఆ జంటను పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. కేసు నమోదు చేశారు. వారిని పంకజ్ దత్తా, అభా యాదవ్ గా గుర్తించారు. వీరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.