ఆ సంఘటనతో ‘బాబు’కు ఉత్సహం..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. రాజధానిలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు స్టే ఇవ్వడం చంద్రబాబులో ఉత్సాహం నింపిందని అంటున్నారని ట్వీట్లర్ లో పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే తన పార్టీకి పుట్టగతులుండవనే భయం బాబుకు పట్టుకుందన్నారు. జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నాడట అని వెల్లడించారు. ‘బాబు’ వాడకం ఎలా […]

Written By: Neelambaram, Updated On : May 17, 2020 5:46 pm
Follow us on


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. రాజధానిలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు స్టే ఇవ్వడం చంద్రబాబులో ఉత్సాహం నింపిందని అంటున్నారని ట్వీట్లర్ లో పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే తన పార్టీకి పుట్టగతులుండవనే భయం బాబుకు పట్టుకుందన్నారు. జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నాడట అని వెల్లడించారు.

‘బాబు’ వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుందన్నారు. ఎల్లోవైరస్ ప్రభావంతో వైజాగ్ లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని! అయ్యో అంత అన్యాయం జరిగిందా అని ఒక ప్రెస్ నోటు రిలీజవుతుంది.