Venkayya Naidu : భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు(Venkayya Naidu) రామాయణం, మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాలను అందరూ చదవాలని పదేపదే సూచించారు. ఈ రెండు గ్రంథాలు కేవలం సాహిత్య రచనలు మాత్రమే కాక, జీవన విలువలు, నీతి, ధర్మం, సంస్కృతిని నేర్పే జీవన గైడ్లని ఆయన అభిప్రాయపడ్డారు. యువతలో చదివే అలవాటును పెంపొందించడం, వీటి ద్వారా నైతికతను పెంపొందించడం ఆయన లక్ష్యంగా చెప్పారు. శ్రీరాముడు(Sriramudu) అసమానతలు లేని ఆదర్శ పాలన అందించారని తెలిపారు. నెల్లూరు జిల్లా డి చౌటుపాళెంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మాట్డారు.
Also Read : జాతీయ పార్టీలకు షాక్ ఇచ్చిన టిడిపి!
ఎందుకు చదవాలి?
వెంకయ్య నాయుడు తన ప్రసంగాల్లో రామాయణం(Ramayanam), మహాభారతం(MahaBharatham) నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని తెలిపారు. రామాయణంలో శ్రీరాముడు ఆదర్శ కుటుంబ సభ్యుడిగా, ధర్మపరుడిగా, న్యాయవంతమైన పాలకుడిగా ఎలా జీవించాడో చూపిస్తాడు. అదే విధంగా, మహాభారతం మానవ జీవితంలోని సంక్లిష్టతలు, నీతి యుద్ధాలు, కర్తవ్యాలను వివరిస్తుంది. ఈ గ్రంథాలు యువతకు సరైన మార్గాన్ని చూపడమే కాక, సమాజంలో వివక్ష, అవినీతి వంటి దుర్గుణాలను అరికట్టేందుకు ప్రేరణనిస్తాయని ఆయన భావించారు.
విద్యా విధానంలో భాగం కావాలి
2024 జనవరిలో పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్య నాయుడు, ‘రామాయణం, మహాభారతం విద్యా విధానంలో భాగం కావాలి. ఇవి కేవలం మత గ్రంథాలు కాదు, జీవన విలువలను నేర్పే గొప్ప ఇతిహాసాలు‘ అని అన్నారు. ఇవి ఆదర్శ రాజ్యం, మానవత్వం గురించి గాంధీజీ చెప్పిన ’రామ రాజ్యం’ భావనకు అద్దం పడతాయని చెప్పారు.
సాంస్కృతిక పునరుజ్జీవనం
‘ఈ గ్రంథాలు భారత సంస్కృతి, ఆధ్యాత్మికతకు మూలం’ అని పేర్కొన్నారు. 2021లో కేరళలో జరిగిన ఒక సభలో, రామాయణ మాసం సంప్రదాయాన్ని పునరుద్ధరించడంలో పి. పరమేశ్వరన్ను ప్రశంసిస్తూ, ఈ ఇతిహాసాలు ఆసియా సాంస్కృతిక జీవనంపై గాఢ ప్రభావం చూపాయని అన్నారు. వీటిని చదవడం ద్వారా సమాజంలో ఐక్యత, శాంతిని పెంపొందించవచ్చని సూచించారు. వెంకయ్య నాయుడు పిలుపు యువతను, సమాజాన్ని ఈ గ్రంథాల వైపు మళ్లించే ప్రయత్నంగా నిలుస్తుంది.