Homeఆంధ్రప్రదేశ్‌‘కాపు’లకు కొత్త నాయకుడు.. నెగ్గుకొస్తాడా?

‘కాపు’లకు కొత్త నాయకుడు.. నెగ్గుకొస్తాడా?


కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాడి వదిలేశారు. కాపుల కొట్లాటలు.. కాపు రాజకీయాల్లో తాను బలికాలేను అంటూ పదవిని త్యజించాడు. తనపై దుష్ప్రచారం చేస్తున్నందుకు మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నారు. దానివెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో కానీ ఆయన మాత్రం పక్కకు జరిగారు.

Also Read: అప్పటివరకూ అమరావతే ఏపీ రాజధాని…! జగన్ కు దిమ్మతిరిగే షాక్

మరి రెడ్డిలకు జగన్ ఉన్నారు. కమ్మలకు చంద్రబాబు ఉన్నారు. మరి కాపులకు ఎవరున్నారు అనుకుంటుండగానే బీజేపీ ప్రయోగం చేసింది. కాపు నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. కాపుల తరుపున ఆయనకు నాయకత్వం ఇచ్చింది. అయితే సోము వీర్రాజు ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన దాఖలాలు లేవు. పైగా పార్టీని లీడ్ చేసిన అనుభవం లేదు. సో కొత్తనేతపై బోలెడు ఆశలు బీజేపీలో ఉన్నాయి. ఆయన బీజేపీని బలపేతం చేస్తాడా? అధికారంలోకి తీసుకొస్తాడా అన్నది వేచిచూడాలి.

ఇక వీరే కాదు.. ముద్రగడ వైదొలగడంతో ఖాళీ అయిన కాపు ఉద్యమాన్ని, నాయకత్వాన్ని చేజిక్కించుకోవాలని తాజాగా ఓ నాయకుడు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనే పేరు, ప్రఖ్యాతలు.. వారసత్వం ఉండి.. కనుమరుగైన నేత వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి రాధాకృష్ణ తండ్రి రంగ ఏపీ రాజకీయాల్లో కాపుల తరుఫున పోరాడిన ఫేమస్ నాయకుడు. ఆయనకు ఇప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రంగా ఇప్పటికీ బెజవాడలో ఆకర్షనీయమైన అభిమనగణం ఉన్న నాయకుడు. ఇప్పటికీ లక్షలాది మంది రంగాను ఆరాధిస్తారు.

వంగవీటి రాధాకృష్ణ తన తండ్రి రంగా వారసత్వాన్ని పొందారు. పైగా ప్రసిద్ధ తండ్రిని పోలి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా నాయకుడిగా నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల వరకు ఉన్నారు.

Also Read: ఎంపీ Vs ఎమ్మెల్యే! మరోసారి వివాదం షురూ..!

అయితే వంగవీటి రాధా చేసిన పెద్ద పొరపాటు 2019 ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం. టీడీపీలో కూడా ఆయనకు కావలసిన టికెట్ దక్కలేదు. జగన్ వైసీపీ సునామీలో రాధా తుడిచిపెట్టుకుపోయాడు. ప్రస్తుతం టీడీపీలో సైలెంట్ గా ఉంటున్నారు.

వంగవీటి రాధా గురించిన తాజా అప్ డేట్ ఏంటంటే.. అతడు కాపు రాజకీయాలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల కాపు ఉద్యమ నాయకత్వం నుంచి వైదొలగిన ముద్రగడ పద్మనాభం స్థానాన్ని స్వాధీనం చేసుకోవడం తనకు సరైనదని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బలిజనాడు నాయకుడు ఏ.ఓ రమణతో తాజాగా కీలక భేటి నిర్వహించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఇటీవల ఏఓ రమణను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. కాబట్టి రమణ, రాధాకృష్ణ ఇద్దరూ కలిసి కాపు రాజకీయాలను మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

కాపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పోరాడి.. ఏకం చేసి అధికారంలోకి తీసుకురావాలని ఈ ఇద్దరు నాయకులు భావిస్తున్నారు. కానీ వంగవీటి రాధా నాయకత్వ లోపాలు ఇప్పటికే చాలా బయటపడ్డాయి. వైఎస్ జగన్ పాలనలో కాపులకు చాలా ప్రయోజనాలే కల్పించారు. ఇక తండ్రి రంగా అంత పవర్ ఫుల్ కాదు రాధా. ముద్రగడ అంత నేత కూడా కాదు.. సో కాపు నాయకత్వాన్ని వంగవీటి రాధా నిర్వహించగలరా? లేదా అన్నది కాపుల్లోనూ అనుమానాలకు కారణమవుతోంది. చూడాలి మరీ కాపుల నేతగా వంగవీటి ఎదుగుతాడో లేదో..

-ఎన్నం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version