Homeజాతీయ వార్తలుUnion Minister Nirmala Sitharaman: మోడీ ఫొటో లేకపోవడంతో నిర్మల తండ్లాట అంతా ఇంతా కాదే?

Union Minister Nirmala Sitharaman: మోడీ ఫొటో లేకపోవడంతో నిర్మల తండ్లాట అంతా ఇంతా కాదే?

Union Minister Nirmala Sitharaman: అంతర్జాతీయంగా ప్రధాని మోదీ తిరుగులేని నేత. ఇది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఆయన ఎదిగారు. చాలా సందర్భాల్లో గుర్తింపు సాధించారు. సాహోసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. అటువంటి ప్రధాని మోదీని దేశంలోని కొన్ని రాష్ట్రాల పాలకులు గుర్తించకపోవడం అటు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పాలకులకు మింగుడుపడని అంశం. రాజకీయంగా విభేదించే చాలా రాష్ట్రాలు ప్రధానిని లెక్క చేయకపోవడంపై కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇటువంటి పరిస్థితే కేంద్రానికి ఎదురయ్యింది. తెలంగాణలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. రేషన్ డిపోల్లో ప్రధాని ఫొటో లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూడా కొద్ది నెలల కిందట పర్యటించిన ఆమెకు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఆమె కలెక్టర్లతో పాటు ఇతర అధికారులపై రుసరుసలాడారు. తక్షణం ప్రధాని మోదీ ఫొటోను ఏర్పాటుచేయాలని ఆదేశాలివ్వాల్సివచ్చంది.

Union Minister Nirmala Sitharaman
Union Minister Nirmala Sitharaman

బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట..
కొవిడ్ అనంతరం దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న రేషన్ లబ్ధిదారుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కోటా కింద ఉచితంగా రేషన్: బియ్యం అందిస్తూ వస్తోంది. గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేకున్నా..బీజేపీయేతర పార్టీలు అధికారమున్న చోట మాత్రం కేంద్రం అందించే ఉచిత బియ్యం పంపిణీ సమయంలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడా కేంద్రం ముద్ర లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడుతూ వస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి రుచించడం లేదు. తాజాగా తెలంగాణ పర్యటనలో భాగంగా బాన్సువాడ జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ డిపోలను సందర్శించారు. కానీ అక్కడ సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రుల ఫొటోలే దర్శనమిచ్చాయి. దీంతో కోపంతో ఊగిపోయిన కేంద్ర మంత్రి అక్కడే ఉన్న కలెక్టర్ ను పిలిచారు. ఏంటీ ఈ పరిస్థితి అని ప్రశ్నించారు. కేంద్రం ఉచితంగా రేషన్ అందిస్తుంటే కనీసం ప్రధాని మోదీ ఫొటోను ఏర్పాటుచేయకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఫొటోలను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని గట్టిగానే చెప్పారు.

Also Read: Pawan Kalyan Birthday Special: ‘పవర్‌’ మార్చే పవన్‌ స్టార్‌.. జన సేనాని రాజకీయ లక్ష్యం అదే!

Union Minister Nirmala Sitharaman
Union Minister Nirmala Sitharaman

నిరసన సెగలు..
మరోవైపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ పర్యటనలో అడుగడుగునా నిరసన సెగలు తగులుతునే ఉన్నాయి. బాన్సువాడ పర్యటనకు వచ్చిన ఆమెను యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెంచిన పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కాన్వాయన్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. మొత్తానికి వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న నిర్మలాసీతారామన్ కు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు రుచించలేదు. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నిధులు కేటాయిస్తున్నా క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడాన్ని ఆమె గుర్తించారు. ఢిల్లీ వెళ్లి స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని ఆమె భావిస్తున్నారుట. కేంద్రం సదుద్దేశ్యంతో అందిస్తున్న ఉచిత రేషన్ ను తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడంపై ఓకింత ఆగ్రహంతో ఉన్నారు. ఫొటో రాజకీయాలను చెక్ చెప్పేందుకు ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Also Read:Gautam Adani: అప్పులు చేసి ఆస్తులు పెంచుకుంటున్న అదాని.. ప్రపంచంలో మూడో సంపన్నుడిగా గుర్తింపు !!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version