ఈ ఘటన చూస్తే నిజమే అనిపిస్తుంది. పురుష సమాజం సిగ్గు పడేలా మహిళలే తమ పరులు తీసుకునేలా వ్యవహరించడం కొసమెరుపు. సాఫ్ట్ వేరైనా, హార్డ్ వేరైనా మందు కొడితే చాలు మగాడిలా రెచ్చిపోతారని తెలుసు. దానికి ఉదాహరణే ఈ సన్నివేశం. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఇద్దరు మహిళలు మందేసి వీరంగం చేశారు. తాగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
తెనాలి మండలం సోసుందరపాలెం వద్ద ఇద్దరు మహిళలు మద్యం మత్తులో హల్ చల్ చేశారు. మూల్చూరుకు చెందిన ఓ మహిళ, తెనాలికి చెందిన మరో మహిళ స్నేహితురాళ్లు. ఇద్దరు కలిసి తెనాలిలో మందు తాగారు. ఇక అంతే సంగతి ఇద్దరిలో గొడవ ముదిరి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో స్థానికులు నివ్వెరపోయారు. ఇదేం చోద్యం అని ముక్కున వేలేసుకున్నారు.
దీంతో మూల్చూరుకు చెందిన మహిళ బలంగా కొట్టడంతో తెనాలికి చెందిన మహిళ కుప్పకూలిపోయింది. ఈ సందర్భంగా ఆడాళ్ల ఫైటింగ్ ను స్థానికులు ఎంజాయ్ చేశారు. మగాళ్లు కొట్టుకుంటే ఎవరు చూస్తారు కానీ మహిళలు కావడంతో ఇంట్రస్ట్ గా అందరూ చూశారు. వారి గొడవతో చుట్టు జనం పోగయ్యారు. చివరికి 108కు సమాచారం అందించడంతో వారు వచ్చి మహిళలను ఆస్పత్రికి తరలించార.