ఘోరం.. రైలు చక్రాలక్రింద నలిగిన కూలి బ్రతుకులు!

    ఇటీవల వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సొంతూళ్లకు వెళదామని వాళ్లంతా రెడీ అయ్యారు.. మూట ముల్లె సర్దుకొని బయలుదేరారు.. అప్పటికే రాత్రి కావస్తుండటం, పైగా అలసిపోవడంతో సేదతీరుదాం అనుకున్నారు. ఆ పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. లాక్ డౌన్ కదా రైళ్ళు తిరగడం లేదుగా అనుకున్నారు. రైల్వే ట్రాక్ నే తలగడగా చేసుకొని, అక్కడే నిద్రకు ఉపక్రమించారు. అంతలోనే ఒక రైలు వచ్చింది. ఆ రైల్వే […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 9:43 am
Follow us on

 

 

ఇటీవల వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సొంతూళ్లకు వెళదామని వాళ్లంతా రెడీ అయ్యారు.. మూట ముల్లె సర్దుకొని బయలుదేరారు.. అప్పటికే రాత్రి కావస్తుండటం, పైగా అలసిపోవడంతో సేదతీరుదాం అనుకున్నారు. ఆ పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. లాక్ డౌన్ కదా రైళ్ళు తిరగడం లేదుగా అనుకున్నారు. రైల్వే ట్రాక్ నే తలగడగా చేసుకొని, అక్కడే నిద్రకు ఉపక్రమించారు. అంతలోనే ఒక రైలు వచ్చింది. ఆ రైల్వే ట్రాకే తమ పాలిట మృత్యువు అవుతుందని వాళ్లు ఊహించలేదు. ఆ 15మంది వలస కూలీలను ఆ రైలు చిదిమేసింది. చక్రాల కింద నలిపేసింది. రక్తమాంసాలను పిప్పి చేసేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

సొంతూళ్లకు బయలుదేరిన 15 మంది వలస కూలీలు రైలు చక్రాల కింద నలిగిపోయారు. ఛత్తీస్‌ గఢ్‌ కు పయనమైన వలస కూలీలు (మహారాష్ట్రలో పనిచేస్తున్నారు) గురువారం రాత్రి ఔరంగాబాద్‌ కు చేరుకున్నారు. రాత్రి కావడంతో రైల్వే ట్రాక్‌ పై నిద్రపోయారు. అయితే, ఓ గూడ్స్ రైలు వచ్చే విషయం తెలీక గాఢ నిద్రలోనే ఉండిపోయారు. అంతే.. ఆ రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఆ రైలు చక్రాల కింద నలిగి 15 మంది దుర్మరణం చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఔరంగాబాద్‌ కు సమీపంలోని కర్మాద్ ప్రాంతంలో చోటుచేసుకుందీ ప్రమాదం.

కాగా, లాక్‌ డౌన్ దెబ్బకు సొంతూళ్లకు పయనమైన వలస కూలీలు అడుగడుగునా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆకలితో అలమటిస్తూ, అనారోగ్య పాలవుతూ ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా.. ఈ దారుణం దేశ ప్రజలను తీవ్రంగా కలచి వేసింది.