రాష్ట్ర ప్రభుత్వం ఎలా తొలగిస్తుంది?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు రాజ్యాంగంలో రక్షణ కల్పించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఎలా తొలగిస్తుంది అనేది స్పష్టం చేయాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. ఇందుకు ఆయన కొంత సమయం కోరడంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు అడ్వకేట్ జనరల్ తన వాదనలను వినిపిస్తూ ఎస్‌ఇసి యొక్క సేవలను  నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఆర్టికల్ 243(కె) లో అటువంటి పాలన నియమాలకు వ్యతిరేకంగా […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 8:01 pm
Follow us on


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు రాజ్యాంగంలో రక్షణ కల్పించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఎలా తొలగిస్తుంది అనేది స్పష్టం చేయాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. ఇందుకు ఆయన కొంత సమయం కోరడంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు అడ్వకేట్ జనరల్ తన వాదనలను వినిపిస్తూ ఎస్‌ఇసి యొక్క సేవలను  నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఆర్టికల్ 243(కె) లో అటువంటి పాలన నియమాలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షలు రాజ్యాంగంలో పేర్కొనలేదని ఆయన అన్నారు. ఆర్టికల్ 243 కె (2) లో పేర్కొన్న విధంగా ఎస్‌ఇసి ని నియంత్రించడానికి ఎటువంటి నియమాలు రూపొందించబడనందున, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం కాదని ఆయన వాదించారు. ఆయన వాదనలకు మద్దతుగా కొన్ని తీర్పులను ఉటంకించారు. ప్రిల్ సెక్రటరీ కేడర్ లో నియమింపబడిన కమిషనర్ లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధులకు సంబంధించి విమర్శలు అధిక సంఖ్యలో వచ్చాయని, ఇలాంటి విమర్శలకు ఎపి హైకోర్టు తీర్పులను సూచించిందని ఆయన అన్నారు. ఆర్డినెన్స్ ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉందని, ఎన్నికల సంస్కరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!

రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై వస్తున్న బహిరంగ విమర్శలకు అడ్డుకట్ట వేయడానికి, న్యాయబద్ధంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని తీసుకున్న నిర్ణయం సరైనాదెన్నని ఎజి వాదించారు. ఇదే సమయంలో కమిషనర్ పదవీకాలం 5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు తగ్గించబడిందని తెలిపారు. పంచాయతీ రాజ్ చట్టం యొక్క సెక్షన్ 200 ప్రకారం ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ అంగీకరించారని తెలిపారు. తన వాదనలకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పులను కోట్ చేశారు.