Homeజాతీయ వార్తలుతెలంగాణలో షర్మిల అస్త్రాలు అవేనా..?

తెలంగాణలో షర్మిల అస్త్రాలు అవేనా..?

Sharmila
తెలంగాణ వచ్చిన నాటికి… నేటికి పరిస్థితులు చాలా మారాయి. నాడు ఉద్యమ నాయకులుగా పేరొందిన ఎందరో ఇప్పుడు అక్రమార్కులుగా వెలుగొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి.. చావునోట్లో తలపెట్టానని చెప్పుకుంటున్న కేసీఆర్ మొదట్లో దూకుడుగా వ్యవహరించారు. అడిగిందల్లా ఇస్తూ.. బోలా నాయకుడిగా పేరు పొందారు. మొదటి ఐదేళ్లలో అందరిలో మన్ననలు పొందిన సీఎం కేసీఆర్ తరువాత అధికారంలోకి వచ్చాక చాలా సందర్భాల్లో విఫమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ వైఫల్యాలు.. అతడి వీక్నెస్ ను ఆసరా చేసుకుని షర్మిలా రంగంలోకి దిగాలని చూస్తున్నట్లు ఆమె అనుచరులు అంటున్నారు.

Also Read: షర్మిల రిటర్న్.. గులాబీ నేతల్లో టెన్షన్..?

అవును క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చలు చూస్తుంటే అంతే అనిపిస్తోంది. తెలంగాణలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్సార్ చెరగని ముద్రవేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైలు లాంటి అనేక పథకాలు వైఎస్ హయాంలో వచ్చినవే. ఉచిత విద్య, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ లాంటి అనేక సంక్షేమ పథకాల గురించి చెబితే.. ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్. రాజశేఖర రెడ్డి గారే.. పైగా వైఎస్.. రాష్ట్ర విభజనకు 100శాతం వ్యతిరేకం.

వైఎస్ ఉన్నంతకాలం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం గురించి తీసిన రోజు లేదు. అసెంబ్లీలో విజయరమణారావు, హరీశ్ రావు వంటి నేతలు మాట్లాడినా.. వైఎస్ వారించేవారు.దాంతో వారు మళ్లీ నోరెత్తే సాహసం చేసేవారు కాదు. అలాంటి వైఎస్ ఆకస్మిక మరణంతో కేసీఆర్ కు ధైర్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. అది కూడా నీళ్లు.. నియామకాలు.. ఉపాధి.. ఆత్మగౌరవం నినాదాలతో..

Also Read: గ్రేటర్ పీఠంపై కమలం కన్ను.. !

ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ వచ్చిందో.. అది నెరవేరలేదని చెప్పాలి. కేసీఆర్ సీఎంగా గద్దెనెక్కి ఏడేళ్లు గడిచింది. ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఉపాధి అవకాశాలు ఎంతమందికి అందాయో దేవుడికే తెలియాలి. ఇక ఆత్మగౌరవం పదానికి అర్థమే మారిపోయింది. ఇదే విషయం గురించి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు చాలా మంది ఉద్యమకారులు కేసీఆర్ ను తిడుతున్నారు.

ఉద్యమం పేరుతో జనాలను కేసీఆర్ మోసం చేశారని కోదండరాంతో పాటు అనేక మంది తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, టీడీపీలు విఫలం అయ్యాయయని చెప్పాలి. బీజేపీకి అంత సీన్ లేదని అనుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ వైఫల్యాల ఆధారంగానే రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు షర్మిల వైఎస్సార్ సీపీ తెలంగాణ అనే పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. తెలంగాణ వచ్చి ఇన్ని ఏళ్లయినా.. ఉచిత విద్య అందడం లేదు.. వైద్య అందడం లేదు.. ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని షర్మిల అన్నారు. ఈ క్రమంలో తన ఎజెండాను చెప్పకనే చెప్పేశారని కొందరు అంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular