Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: అధికార పార్టీపై వ్యతిరేకత అనేక కారణాలు.. షాకింగ్‌ నిజాలు!

Telangana Elections 2023: అధికార పార్టీపై వ్యతిరేకత అనేక కారణాలు.. షాకింగ్‌ నిజాలు!

Telangana Elections 2023: అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంది. పదేళ్లలో ఏ రాష్ట్రం సాధించనంత అభివృద్ధి సాధించింది. ఇదీ బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పే మాటలు. ఎన్నారైలు కూడా ఇదే వాస్తవం అని నమ్ముతున్నారు. ఇటీవల, సినీ నటుడు రజనీకాంత్‌ దీనిని న్యూయార్క్‌తో పోలుస్తూ ప్రశంసించారు. తెలుగు ఎన్నారైలు కూడా గణనీయమైన మార్పులు వచ్చాయని ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా, పురోగతి కనిపించినప్పటికీ, వివిధ సర్వేలు సూచించినట్లుగా అధికార పార్టీపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గచ్చిబౌలికి నిలయమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంది, బీఆర్‌ఎస్‌ మూడవ స్థానంలో వెనుకబడి ఉంది. ఇలాంటి నియోజకవర్గాలు అసలు బీఆర్‌ఎస్‌పై అంత వ్యతిరేకత ఏంటి అన్న ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అభివృద్ధి స్పష్టంగా ఉన్నా.. నాయకుల తీరు, వారి అరాచకాలు, కబ్జాలు, కమీషన్లు, అనుచరులకు దోచిపెడుతున్న తీరు బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతకు ప్రధాన కారణం.

ప్రత్యక అనుభవాలతో పెరిగిన వ్యతిరేకత..
అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు కేసీఆర్‌ పదే పదే చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ బాధితులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. ప్రజాప్రతినిధుల పేరుతో దందాలు, సెటిల్‌మెంట్లు, కబ్జాలు, ఎదురించినవారిపై, ప్రశ్నించివారిపై పోలీసులతో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం వంటి అనేక కారణాలతో ప్రజలు ప్రత్యకంగా ఇబ్బంది çపడుతున్నారు. సామాన్యుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నారు. ఈ వ్యతిరేకతే.. తెలంగాణ సమాజం మార్పు కోరుకునేలా చేసింది.

రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి..
శేరిలింగపల్లి మాత్రమే కాదు.. ఇలాంటి అకృత్యాలు రాష్ట్రమంతటా కొనసాగుతున్నాయి. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోయినా లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం, నోటిఫికేషన్లు వచ్చిన వాటి ప్రశ్నపత్రాలు లీక్‌ చేయడం, డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకోవడం లాంటి కారణాలు కూడా ఇందుకు తోడవుతున్నాయి. ఇక ధరణి కారణంగా గ్రామీణ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దళారీ వ్యవస్థ ఉండకూడదనే ధరణి తెచ్చామని సీఎం కేసీఆర్‌ చెబుతున్నా.. ధరణి పేరుతో నాయకులు, అధికారులు పేద, మధ్యతరగతి రైతులను దోపిడీ చేస్తున్నారు. రైతుకు భూమిపై ఉన్న మమకారాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల్లో..
ప్రభుత్వ ఉద్యోగులలో దాదాపు 85% మంది అసంతృప్తితో ఉన్నారు. బకాయిలు, డీఏలు వంటి బకాయి మొత్తాలతోపాటు జీతాల పంపిణీలో జాప్యం పాలకులపై వ్యతిరేకతను పెంచింది. రాష్ట్రం ఆర్థికంగా పటిష్టంగా ఉందని అభివర్ణిస్తున్నప్పటికీ జీతాలు చెల్లించలేకపోవడం ఆగ్రహానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్‌ కన్నా అధ్వానంగా ఉద్యోగుల పరిస్థితి ఉంది.

పార్టీ పేరు మార్పు..
ఈ మనోవేదనల మధ్య, టీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన పార్టీ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిందని, దాని పేరుతో ’తెలంగాణ’ నుంచి నిర్లిప్తతను సూచిస్తుందని, రాష్ట్ర ప్రజల సొమ్మును తీసుకెళ్లి పంజాబ్, మహారాష్ట్రలో ఖర్చు చేయడం వంటి కారణాలు కూడా బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతకు మరో కారణం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version