Homeఆంధ్రప్రదేశ్‌Rayalaseema - లా పాయింట్ లాగిన‌ తెలంగాణ!

Rayalaseema – లా పాయింట్ లాగిన‌ తెలంగాణ!

Water Disputes

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టుపై ఎట్ట‌కేల‌కు కృష్ణాబోర్డు నివేదిక సిద్ధం చేస్తోంది. ఈ మ‌ధ్య‌నే ప్రాజెక్టు నిర్మిత ప్రాంతాన్ని క‌మిటీ ప‌రిశీలించింది. అయితే.. తెలంగాణ‌కు చెందిన అధికారులు ఎవ‌రూ ఈ క‌మిటీలో ఉండొద్ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ష‌ర‌తు విధించింది. దీంతో.. ఏపీ అభ్యంత‌రాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్‌.. రెండు రాష్ట్రాల‌కు చెందిన అధికారులు లేకుండా అక్క‌డికి వెళ్లాల‌ని సూచించింది.

ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. క‌మిటీ రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌ను సంద‌ర్శించింది. అయితే.. ఇక్క‌డే ట్విస్టు చోటు చేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన ఉన్న‌తాధికారులు ఈ క‌మిటీని క‌లిశారు. అంతేకాదు.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ద‌గ్గ‌ర త‌మ‌దైన వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. అంతేకాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈఎన్‌సీ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ కూడా ఇచ్చింది. మ‌రి, ఇంత జ‌రుగుతుంటే.. తెలంగాణ చూస్తూ ఎందుకు ఊరుకుటుంది?

తెలంగాణ అధికారులు లేకుండా ప్రాజెక్టును సందర్శించినప్పుడు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికారుల‌ను మాత్రం ఎందుకు భాగం చేశార‌ని సూటిగా ప్ర‌శ్నించింది. కాబ‌ట్టి.. కృష్ణాబోర్డు ఇచ్చే నివేదిక‌లోని నిస్పాక్షిక‌త‌పై అనుమానాలు వ్య‌క్తం చేసింది. దీంతో.. ఇప్పుడు అంద‌రి దృష్టీ కృష్ణాబోర్డు ఇచ్చే నివేదిక‌పైనే నెల‌కొంది. అందులో ఏముంది అన్నది తెలిసిన‌ త‌ర్వాత స‌ర్కారు త‌మ‌దైన రీతిలో స్పందించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఒక‌వేళ రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై తెలంగాణ స‌ర్కారు ఆరోపిస్తున్న‌ట్టుగా రిపోర్టు లేక‌పోతే.. మ‌రిన్ని ఘాటైన ఆరోప‌ణ‌లు చేసే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీ అధికారులు క‌లవ‌డం వ‌ల్లే రిపోర్టు తారుమారైంద‌నే ఆరోప‌ణ‌లు చేసే ఛాన్స్ కూడా ఉందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో.. త‌మ‌కు అనుకూలంగా లేక‌పోతే.. ఏపీ కూడా వెన‌క్కు త‌గ్గే సూచ‌న‌లు క‌నిపించ‌ట్లేదు. కాబ‌ట్టి.. ఈ నీటి పంచాయితీ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. మ‌రి, ఏం జరుగుతుంద‌న్న‌ది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Oktelugu Epaper
Exit mobile version