Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Capital Issue: అమరావతి కథకు ఇప్పట్లో శుభంకార్డు పడదా...

Amaravati Capital Issue: అమరావతి కథకు ఇప్పట్లో శుభంకార్డు పడదా…

Amaravati Capital Issue: అమరావతి రాజధాని ఇష్యూ ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తొలుత హైకోర్టులో కేసు విచారణ జరిగే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం కోరుకోగా.. ఇప్పుడు సుప్రిం కోర్టులో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. జనవరి 31న అమరావతిపై తుది తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు అమరావతి రైతులు ఎవరికి వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే అత్యున్నత న్యాయస్థానం కేసు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. దీంతో ఈ కేసు విచారణ ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితులైతే కనిపించడం లేదు.

Amaravati Capital Issue
Amaravati Capital Issue

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నాటి నుంచి అమరావతి రైతులు పోరాటబాట పట్టారు. ఒక్క వైసీపీ మినహాయించి అన్ని రాజకీయ పక్షాలు అమరాతికే మద్దతు తెలిపాయి. దీంతో అమరావతి రైతుల ఉద్యమం పతాక స్థాయికి వెళ్లింది. హైకోర్టులో సుదీర్ఘ కాలం విచారణ సాగింది. చివరకు హైకోర్టు సైతం అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ పరిణామ క్రమంలో హైకోర్టులో కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేసిందన్న వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే హైకోర్టులో ప్రతికూల తీర్పు వచ్చిందో దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దీంతో సుప్రిం కోర్టులో విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కానీ తుది తీర్పు వెల్లడించలేదు. విచారణ కొనసాగించనున్నట్టు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి కేసును వీలైనంత త్వరగా తేల్చాలని సుప్రింకోర్టుకు విన్నవించారు. దీంతో జనవరి 31న తీర్పు తప్పకుండా వస్తుందని అంతా భావించారు. కానీ ఇంతలో అమరావతి రైతులు తమకు జనవరి 27 నోటీసులు అందాయని.. పూర్తిస్థాయి వివరాలు కోర్టుకు దాఖలు చేయడానికి కనీసం మూడు వారాల వ్యవధి కావాలని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అమరావతి రాజధాని తీర్పుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మరికొన్నిరోజులు వేచిచూడక తప్పడం లేదు.

Amaravati Capital Issue
Amaravati Capital Issue

వాస్తవానికి కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని భావించిన జగన్ సర్కారు విశాఖ నుంచి పాలన సాగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉగాదికి అటు ఇటుగా సీఎం విశాఖ క్యాంప్ ఆఫీసు నుంచి పాలన ప్రారంభిస్తారని మంత్రులు, వైసీపీ కీలక నేతలు ప్రకటనలు ఇస్తూ వచ్చారు. మంత్రులు క్యాంప్ ఆఫీసులను సిద్ధం చేసుకోవాలని సైతం అంతర్గతంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టు పరిధిలో కేసు ఉన్నందున కేవలం సీఎం క్యాంప్ ఆఫీసు పేరిట ప్రకటన ఇస్తూ వచ్చారు. కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం సచివాలయం తరలింపునకు సైతం సన్నాహాలు చేయాలని భావించారు. అటు ఉద్యోగులను కూడా మానసికంగా విశాఖకు వెళ్లే విధంగా సిద్ధం చేశారు. అయితే సుప్రిం కోర్టు కేసు విచారణను వాయిదా వేసేసరికి వారి ఆశలు నీరుగారిపోయాయి. ఇన్నాళ్లూ హైకోర్టులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయగా.. ఇప్పుడు అదే పంథాను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యర్థులు అనుసరిస్తున్నారు. సుప్రింకోర్టులో విచారణ జాప్యానికి అవకాశమున్న అంశాలను వినియోగించుకుంటున్నారు. దీంతో ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.

 

అదానీ వ్యవహారం మోడీ మెడకు చుట్టుకుంటుందా? || You need to know about the story of Adani vs Hindenburg

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper
Exit mobile version