spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి చెక్.. ఆ ఇద్దరితో టీడీపీ మంత్రాంగం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి చెక్.. ఆ ఇద్దరితో టీడీపీ మంత్రాంగం

Vallabhaneni Vamsi: ఏపీలో కరుక్షేత్రం స్థాయిలో రణరంగం జరుగుతోంది. అన్ని పార్టీలకు గెలుపు ముఖ్యం. కొందరి నాయకులకు ప్రాణసంకటం. అందుకే సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మొహమాటాలకు పోకుండా బలమైన అభ్యర్థులను బరిలో దించి విజయాలను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. ఈ ఎన్నికల్లో గెలుపుపైనే ఆయన రాజకీయ జీవితం కొనసాగింపు ఆధారపడి ఉంది. అందుకే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. అటు కుమారుడు లోకేష్ తో పాదయాత్ర చేయించి.. తాను నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అటు పొత్తులపై కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలో తేవడంతో పాటు తనను అన్నివిధాలా ఇబ్బందిపెట్టిన నాయకులను ఓడించాలని డిసైడ్ అయ్యారు. కొడాల నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజా లాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టకూడదన్న కసితో ఉన్నారు.

Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi

గుడివాడలో కొడాలి నాని ని ఓడించేందుకు చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బలమైన అభ్యర్థిని బరిలో దించి నానిని మట్టి కరిపించాలని చూస్తున్నారు. నందమూరి కుటుంబం పేరు చెప్పి ఎమోషన్ బ్లాక్ మెయిల్ తరహాలో మాట్లాడే నానికి.. అదే నందమూరి కుటుంబంతో దెబ్బ తీయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారు. నందమూరి వారసులను గుడివాడ నుంచి రంగంలో దించితే ఎలా ఉంటుందోనని ఆలోచన చేస్తున్నారు. అటు గుడివాడలో జనసేన గ్రాఫ్ బాగుంది. పవన్ అభిమానులు కూడా ఎక్కువ. వంగవీటి కుటుంబ అనుచరగణం అధికం. ఈ నేపథ్యంలో జనసేనకు సీటు అప్పగిస్తే మంచి ఫలితం వచ్చే చాన్స్ ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

గన్నవరంలో అధికార వైసీపీలో నెలకొన్న విభేదాలను క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వల్లభనేని వంశీ గెలుపొందారు. వైసీపీలోకి ఫిరాయించారు. అయితే అప్పటివరకూ వైసీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్న యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావులో ఆందోళన ప్రారంభమైంది. ఆ ఇద్దరు నాయకులు వంశీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే వారిని వంశీ లైట్ తీసుకున్నారు. నాకు అధిష్ఠానంతో పని తప్పించి.. వారెవరు అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. వంశీ చేరిక నుంచి గన్నవరం జఠిలం కావడంతో చివరకు సీఎం జగన్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. వంశీ, వెంకటరావుల మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే ఇప్పుడు వంశీకి సీటు కన్ఫర్మ్ చేయడంతో వెంకటరావు మరో వర్గ నాయకుడు దుట్టా రామచంద్రరరావుతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు అసమ్మతి గళం వినిపించారు.

Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గద్దె రామ్మోహనరావును ప్రయోగించడానికి డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను సొంత నియోజకవర్గం నుంచి పోటీచేయించడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అటు వైసీపీ అసమ్మతి నాయకుడు యార్లగడ్డ వెంకటరావు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని చూస్తున్నారు. అదే జరిగితే వైసీపీలో ఓటు చీలి.. అంతిమంగా టీడీపీకి లాభిస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ఆ ఇద్దరు నేతలకు భరోసా కల్పించారని.. తెరవెనుక మంత్రాంగం కూడా పూర్తి చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version