టీడీపీ, జనసేన ఇంటర్నల్‌ అండర్‌‌స్టాండింగ్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే వన్‌సైడ్‌ అన్నట్లుగానే రిజల్ట్స్‌ వచ్చాయి. అధికార పక్షమే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే.. నేడు కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేయాలని వైసీపీ ఆరాటపడుతోంది. మొత్తం 12 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆయా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు టార్గెట్లు పెట్టి మరీ పెట్టేశారు. వైసీపీలో పంచాయతీ ఎననికల జోష్‌ ఎంతో ధీమా నింపింది. అయితే.. వైసీపీ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు […]

Written By: Srinivas, Updated On : March 10, 2021 10:13 am
Follow us on


ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే వన్‌సైడ్‌ అన్నట్లుగానే రిజల్ట్స్‌ వచ్చాయి. అధికార పక్షమే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే.. నేడు కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేయాలని వైసీపీ ఆరాటపడుతోంది. మొత్తం 12 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆయా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు టార్గెట్లు పెట్టి మరీ పెట్టేశారు. వైసీపీలో పంచాయతీ ఎననికల జోష్‌ ఎంతో ధీమా నింపింది. అయితే.. వైసీపీ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జ‌నసే, టీడీపీ మ‌ధ్య డివైడ్ అయితే 12కు 12 కార్పొరేష‌న్లు గెలుస్తాం అన్న ధీమా కూడా ఉంది.

Also Read: చంద్రబాబు, జగన్, పవన్ భవిష్యత్ ను తేల్చే ‘పురపోరు’ ఇదీ!

అయితే.. ఏపీలో ప‌లుచోట్ల స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టీడీపీ–జ‌న‌సేన మ‌ధ్య ఇంట‌ర్నల్ అండ‌ర్ స్టాండింగ్ న‌డుస్తోంది. ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స్థానిక నేత‌లు అలాగే పెట్టుకున్నారు. ఇది గోదావ‌రి జిల్లాల్లో స‌త్ఫలితాలు ఇచ్చింది. ఇక త్వర‌లో జ‌రిగే మునిసిప‌ల్‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల ఇంట‌ర్నల్ అండ‌ర్ స్టాండింగ్ జ‌ర‌గ‌నుంది. స్థానిక టీడీపీ ఇన్‌చార్జీలు, మాజీ మంత్రులు ఒంట‌రి పోరుతో వైసీపీని ఢీకొట్టలేమని జ‌న‌సేనతో పొత్తులు పెట్టుకుని వారికి కొన్ని సీట్లు స‌ర్దుబాటు చేస్తున్నారు.

ఇటు కార్పొరేష‌న్ ఎన్నికల్లోనూ అదే ఒప్పందం ఉంటే విశాఖ‌ప‌ట్నంతో పాటు విజ‌య‌వాడ‌, ఏలూరు, విజ‌య‌న‌గ‌రంలో మాత్రం ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. వైజాగ్‌లో వైసీపీకి ముందు నుంచి కొంత మైన‌స్ ఉంది. జ‌న‌సేన‌తో ఒప్పందం ఉంటే ప‌వ‌న్‌, జ‌న‌సేన ఓటు బ్యాంకు కూడా టీడీపీకి తోడు అయితే ఇక్కడ వైసీపీకి ఇబ్బంది త‌ప్పదు. ఇక విజ‌య‌వాడ‌లో ముందు నుంచే టీడీపీకి కొంత ఎడ్జ్ ఉంది. ఇప్పుడు కాపులు, జ‌న‌సేన ఓటు బ్యాంకు క‌లిస్తే వైసీపీకి ఇబ్బంది త‌ప్పదు.

Also Read: ఏపీలో పురపోరు.. కొనసాగుతున్న పోలింగ్.. హైలైట్స్ ఇవే

గుంటూరులోనే ఈ రెండు పార్టీల ఒప్పందం ఉన్నా గెలుస్తామ‌న్న ధీమా వైసీపీలో ఉంది. ఇక విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ లో పొత్తులున్నా దెబ్బ పడుతుంద‌ని.. ఇక్కడ మంత్రి బొత్సకు, ఎమ్మెల్యే కోల‌గ‌ట్లకు జ‌రుగుతున్న వార్‌లో కూడా పార్టీకి మైన‌స్ అవుతుంద‌న్న ఆందోళ‌న పార్టీలో ఉంది. ఇక ఏలూరులో జ‌న‌సేన, టీడీపీ ఇంట‌ర్నల్ ఒప్పందం ఉంటే చాలా ట‌ఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని వైసీపీ లెక్క. ఏలూరు, విజ‌య‌న‌గ‌రం చివ‌ర్లో అయినా గెలుచుకుంటామ‌న్న ఆశ వైసీపీలో ఉంది. ఈ కార్పొరేష‌న్లు మిన‌హా మిగిలిన‌వి అన్నీ త‌మ ఖాతాలో వ‌న్‌సైడ్‌గా ప‌డ‌తాయ‌న్న లెక్కల్లో వైసీపీ ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్