Homeఆంధ్రప్రదేశ్‌Krishnudu-YCP: త్వరలో కృష్ణుడుకి వైసీపీ ప్రభుత్వం కీలక పదవి

Krishnudu-YCP: త్వరలో కృష్ణుడుకి వైసీపీ ప్రభుత్వం కీలక పదవి

Krishnudu-YCP: టీడీపీ, జనసేనతో పోలిస్తే వైసీపీకి సినీ గ్లామర్ తక్కువే. వైసీపీ ఆవిర్భావం తరువాత ఒక్క రోజా మాత్రమే ఆ పార్టీ వెంట నడిచారు. కానీ గత సార్వత్రిక ఎన్నికల ముందు మాత్రం నయానో..భయానో చాలా మంది సినీ యాక్టర్లు వైసీపీ గూటికి చేరారు. కొందరు బాహటంగానే మద్దతు తెలిపి ఎన్నికల ప్రచారం చేశారు. నటుడు, నిర్మాత మోహన్ బాబు, పోసాని కృష్ణమురళీ, అలీ, థర్టీ ఈయర్స్ పృధ్విరాజ్, విజయ్ చందర్, భానుచందర్, కృష్ణుడు వంటి నటులు వైసీపీకి బాహటంగానే పనిచేశారు అగ్రనటుడు నాగార్జున సైతం తెరవెనుక వైసీపీ విజయానికి కృషి చేశారు.

Krishnudu-YCP
Krishnudu- JAGAN

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సినీ యాక్టర్లకు గుర్తింపుఅంతంతమాత్రమే. రోజాకు నగిరి సీటిచ్చారు. కానీ ఆమె రెండుసార్లు బోటాబోటీ మెజార్టీతో బయటపడ్డారు. మంత్రి పదవి ఆశించినా సామాజిక సమీకరణల దృష్ట్యా తొలి కేబినెట్ లో దక్కలేదు. విస్తరణలో మాత్రం చోటు దక్కించుకున్నారు. అయితే జగన్ ముందుగా గుర్తింపు ఇచ్చింది మాత్రం థర్టీ ఈయర్స్ పృధ్వీనే. ఏకంగా ఎస్వీసీబీసీ చానల్ చైర్మన్ చేశారు. కానీ ఆయన లైంగిక వేధింపులతో పదవి పొగొట్టుకున్నారు. వైసీపీకి దూరమయ్యారు. త్వరలో జనసేనలో చేరనున్నట్టు ప్రకటించారు.

అయితే రోజా, పృధ్వీకి తప్ప సినీ రంగానికి చెందిన వారికి వైసీపీ ప్రభుత్వంలో గత మూడున్నరేళ్లుగా ఎటువంటి పదవులు దక్కలేదు. దీంతో ఒకరకమైన విమర్శ ప్రారంభమైంది. జగన్ వాడుకొని వదిలేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే మోహన్ బాబు వైసీపీకి దూరంగా జరిగారు. పార్టీ అంటే అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై విమర్శలు చుట్టుముట్టడంతో జగన్ సర్కారు అప్రమత్తమైంది. ఒక్కో నటుడికి పదవులు కట్టబెడుతూ వస్తోంది. అలీకి ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమించగా.. తాజాగా పోసాని కృష్ణమురళీకి ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. అయితే అలీ కంటే కృష్ణమురళీకి ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Krishnudu-YCP
Krishnudu-YCP

అయితే పార్టీలో వాయిస్ బట్టే పదవులు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో థర్టీ ఈయర్స్ పృధ్వి మంచి జోరు మీద ఉండేవారు. చంద్రబాబు, పవన్ లపై ఓ రేంజ్ లో విమర్శలు చేసేవారు. వాటినే గుర్తించుకున్న జగన్ పృధ్వీస్థాయికి మించి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అటు పోసాని కృష్ణమురళీ కూడా పవన్ తో పాటు ఆయన కుటుంబసభ్యులపై వ్యక్తిగత కామెంట్లు చేశారు. సినిమాల్లో చాన్స్ లు సైతం వదులుకున్నరే తప్ప విమర్శలు చేయడం మానలేదు. అందుకే ఆయనకు మంచి పదవి దక్కిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారిద్దరితో పోల్చుకుంటే అలీ ఎప్పుడూ రాజకీయ విమర్శలు చేయలేదు. అందుకే వందలాది మంది సలహాదారుల్లో ఒక పదవి కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు.

ఇక తనకు అత్యంత సన్నిహితుడైన నాగార్జునను వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ చూస్తున్నారు. అయితే ఎప్పుడూ తెర వెనుక రాజకీయాలు చేసే నాగార్జున అందుకు సమ్మతిస్తారా? లేదా? అన్నది అనుమానమే. అయితే మోహన్ బాబు పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు. అటు తాను చంద్రబాబుకు దగ్గరవుతున్న సంకేతాలిచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీలో మిగిలింది ఓన్ అండ్ ఓన్లీ కృష్ణుడు. చేసినవి కొద్ది సినిమాలే అయినా మంచి గుర్తింపు పొందారు కృష్ణుడు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. త్వరలో కృష్ణుడికి ఒక మంచి పదవి కేటాయించి సినిమారంగానికి తగిన ప్రాధాన్యమిచ్చినట్టు మెసేజ్ పంపించాలని జగన్ భావిస్తున్నారుట. సో త్వరలో కృష్ణుడికి కూడా పదవి లభించనుందన్న మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper
Exit mobile version