spot_img
Homeజాతీయ వార్తలుPK Survey Report On Telangana: పీకే సర్వేతో కేసీఆర్ లో గుబులు మొదలైందా?

PK Survey Report On Telangana: పీకే సర్వేతో కేసీఆర్ లో గుబులు మొదలైందా?

PK Survey Report On Telangana: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు తలనొప్పులు మొదలయ్యాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో పార్టీలో చర్చ మొదలైంది. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల్లో చాలా మంది వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేనని తేల్చడంతో గులాబీ పార్టీలో ఆందోళన నెలకొంది. ముచ్చటగా మూడోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్ కు పీకే సర్వే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పీకే సర్వేతో ఎమ్మెల్యేల్లో కూడా టెన్షన్ ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల్లో తమ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. ఇదివరకే గులాబీ బాస్ హెచ్చరికలు జారీ చేసినా నేతల్లో మార్పు మాత్రం రావడం లేదని తెలుస్తోంది.

PK Survey Report On Telangana
PK, kcr

ఇదివరకే పీకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సర్వే నిర్వహించారు. దీంతో వారి భవిష్యత్ డోలాయమానంలో పడింది. దీనిపై అధినేత కేసీఆర్ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఎవరి దారి వారు చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోతే చేయాల్సిన విధి విధానాలపై ఓ స్పష్టత తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల నేతలతో టచ్ లో ఉంటున్నారు. టికెట్ దక్కకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారిస్తున్నారు.

Also Read: Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికలో బీజేపీ వ్యూహమేంటి?

ఎమ్మెల్యేల్లో దాదాపు ఇరవై మంది భవితవ్యం మారనుంది. వారికి టికెట్లు ఇచ్చే విషయంలో పీకే సర్వేను లెక్కలోకి తీసుకుని ఆచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న్టట్లు తెలుస్తోంది. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒకవేళ పార్టీ కాదంటే తదుపరి వ్యూహంపై ఇప్పుడే చూసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలతో చనువుగా ఉంటూ టికెట్ రాకపోతే అందులో చేరేందుకు కూడా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

PK Survey Report On Telangana
pk, kcr

మరోవైపు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా ఎక్కువవుతోంది. దీంతో వారికి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ ఆగరాదనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీల్లో చేరి టికెట్ తెచ్చుకుని విజయం సాధించాలని చూస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తరుణంలో రాష్ట్రంలో పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. పీకే సర్వేతో కేసీఆర్ గుబులు చెందుతున్నారు. పీకే సర్వేతో ఎమ్మెల్యేల జాతకాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి రాజకీయం మారుతోంది. కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు.

Also Read:Hero Prashanth: హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతినడానికి కారణం తండ్రేనా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version