Delhi Schools : దేశ రాజధాని ఢిల్లీలోని ఆరు కంటే ఎక్కువ ప్రముఖ పాఠశాలలకు శుక్రవారం ఉదయం ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత వెంటనే ల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఈ ముప్పును ఎదుర్కొన్న పాఠశాలల్లో పశ్చిమ విహార్లోని భట్నాగర్ పబ్లిక్ స్కూల్, శ్రీనివాసపురిలోని కేంబ్రిడ్జ్ స్కూల్, ఈస్ట్ ఆఫ్ కైలాష్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, డిఫెన్స్ కాలనీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్లోని ఢిల్లీ పోలీస్ పబ్లిక్ స్కూల్, రోహిణిలోని వెంకటేష్ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి.
ఢిల్లీ పోలీసులు పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఇ-మెయిల్లో.. “మీ పాఠశాల ఆవరణలో బాంబులు పెట్టినట్లు అనేక హెచ్చరికలు పంపాము . పేలుడు పదార్థాలు కచ్చితంగా ఉన్నాయి. మీ విద్యార్థులందరూ పాఠశాల ఆవరణలోకి ప్రవేశించినప్పుడు వారి బ్యాగ్లను తనిఖీ చేయవద్దు. అక్కడ ఒక రహస్య డార్క్ వెబ్ గ్రూప్ ఉంది. బాంబులు చాలా శక్తివంతమైనవి. అవి భవనాలను ధ్వంసం చేయగలవు . ప్రజలకు హాని కలిగిస్తాయి చెయ్యవచ్చు. బాంబులు డిసెంబర్ 13న పేలుతాయా లేక డిసెంబర్ 14న పేలుతాయా అన్నది సీక్రెట్. కానీ, ఖచ్చితంగా ఇప్పుడు బాంబులు పెట్టాం.. కానీ డిసెంబర్ 13నా లేక డిసెంబర్ 14న పేలుతాయా అనేది మాత్రం చాలా గోప్యంగా ఉంది. మీ విద్యార్థులు తమ పాఠశాలను ప్రారంభించడానికి మీ పాఠశాల ఆవరణలోకి ప్రవేశించినప్పుడు తిరిగి తనిఖీ చేయవద్దు. మీ అన్ని పాఠశాలు మా డిమాండ్ల కోసం ఈ ఇమెయిల్కు రిప్లై ఇవ్వండి. ” అని మెయిల్లో పేర్కొంది.
బాంబు బెదిరింపులపై పోలీసు బృందాలు వెంటనే అప్రమత్తంగా స్పందించాయి. విద్యార్థులు, సిబ్బంది భద్రత నిమిత్తం క్యాంపస్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాయి. అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని నిర్ధారించారు. బాంబు బెదిరింపు వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న ఓ పేరెంట్ మాట్లాడుతూ.. ‘మాకు (పాఠశాల నుంచి) మెసేజ్ వచ్చింది.. అనివార్య కారణాల వల్ల స్కూల్ను మూసివేస్తున్నట్లు మెసేజ్లో ఉంది. బాంబు, ఫేక్ కాల్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఉదయం 6 గంటలకు మాకు మెసేజ్ వచ్చింది.” అని పేర్కొన్నారు.
రాజధానిలోని 40 కంటే ఎక్కువ పాఠశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. 30,000డాలర్ల డబ్బులను డిమాండ్ చేశారు. ఈ ఇమెయిల్ డిసెంబర్ 8 రాత్రి 11:38 గంటలకు వచ్చింది. ఆ మెయిల్ లో “నేను భవనం లోపల అనేక బాంబులను పెట్టాను. బాంబులు చిన్నవి. దీని వలన భవనానికి చాలా నష్టం జరుగుతుంది. బాంబు పేలినప్పుడు చాలా మంది గాయపడతారు. నాకు 30,000 అమెరికా డాలర్లు ఇవ్వకపోతే, నేను బాంబును పేల్చివేస్తాను.’’ అని పేర్కొన్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించడంలో విఫలమైందని అన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని, శాంతిభద్రతల పరిస్థితిని ఢిల్లీ ప్రజలు ఎన్నడూ చూడలేదని అన్నారు. బాంబు బెదిరింపులు, సంబంధిత అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు SOPతో సహా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నవంబర్ 19న ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. వీటన్నింటినీ పూర్తి చేసేందుకు కోర్టు ఎనిమిది వారాల గడువు విధించింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Security forces respond to bomb threat to schools for second time in a week
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com