Homeజాతీయ వార్తలుSeaplane : సీప్లేన్ గాలి, నీరు రెండింటిపై ఎలా నడుస్తుంది? కేరళలో టెస్టింగ్.. అందుబాటులోకి ఎప్పుడంటే...

Seaplane : సీప్లేన్ గాలి, నీరు రెండింటిపై ఎలా నడుస్తుంది? కేరళలో టెస్టింగ్.. అందుబాటులోకి ఎప్పుడంటే ?

Seaplane : కేరళలో తొలిసారిగా సీ ప్లేన్ ల్యాండ్ అయింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కొచ్చిలోని బోల్గట్టి వాటర్‌డ్రోమ్‌లో దీనిని ల్యాండ్ చేశారు. ప్రస్తుతం సీ ప్లేన్ ల్యాండింగ్ టేకాఫ్ టెస్టింగ్ నడుస్తుంది. వాస్తవానికి సీ ప్లేన్ గాలిలో ఎగురుతుంది.. నీటి పై కూడా నడుస్తుంది. 17 సీట్లతో కూడిన ఈ ప్రత్యేక విమానాన్ని కేరళ టూరిజం మంత్రి పీఎం మహ్మద్ రియాస్ జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వచ్చే ఏడాది అంటే 2025 నుండి భారతదేశంలో సీప్లేన్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించనుంది. ఎయిర్‌లైన్ ప్లాన్ ప్రకారం.. 2025లో లక్షద్వీప్, హైదరాబాద్, గౌహతి, షిల్లాంగ్ సహా దేశంలోని 20కి పైగా రూట్లలో ‘డి హావిలాండ్ కెనడా’ సీప్లేన్ అందుబాటులో ఉండనుంది. ఇందుకోసం సీప్లేన్ తయారీ కంపెనీ డి హావిలాండ్‌తో కంపెనీ పార్టనర్ షిప్ కుదుర్చుకుంది. కుదుర్చుకుంది. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు విమాన సౌకర్యాలను అందించడం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ లక్ష్యం.

గాలి, నీటిపై సీప్లేన్ లక్షణాలు
స్లీప్లేన్ అనేక విధాలుగా చాలా ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఇది నీటిపై కూడా అత్యధిక వేగంతో కదిలేలా డిజైన్ చేశారు. సీప్లేన్ భూమి మీద నడవడమే కాకుండా గాలిలో కూడా ఎగురుతుంది. అందుకే దీనిని ఫ్లయింగ్ బోట్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో తేలియాడడానికి సహాయపడే విధంగా రెండు ఫ్లోట్‌లను కలిగి ఉంది. స్పైస్‌జెట్ కంపెనీ తీసుకొచ్చిన ఈ కనెక్టివిటీ ప్రయాణంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. నీటిలో, గాలిలో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తుంది. సీప్లేన్ విమానం పైలట్లు, సిబ్బందితో పాటు ప్రయాణీకులను తీసుకువెళుతుంది. వీఐపీలు, వైద్య సేవలు, ఇతర అత్యవసర కార్యకలాపాలకు కూడా ఉపయోగించవచ్చు. విశేషమేమిటంటే.. ఈ సీప్లేన్ టేకాఫ్ కావడానికి పొడవైన రన్‌వే అవసరం లేదు.

నీటి నుండి గాలికి ఎలా ఎగరాలి?
సీప్లేన్ నీటి నుంచి గాలిలోకి టేకాఫ్ కావడానికి నీటి అంచున 800 మీటర్ల కంకర రోడ్డు సరిపోతుంది. ఇది రెండు మీటర్ల లోతు నీటిలో కూడా ప్రవేశించగలదు. ఇక్కడ నుండి అది విమానంలా ప్రయాణించగలదు. ఇది భూమి, నీరు, గాలి అనే మూడింటిలోనూ వేగంగా కదిలే విధంగా దీనిని డిజైన్ చేశారు.

ఛార్జీ ఎంత ఉంటుంది?
ఈ సర్వీసును తక్కువ ధరతో ప్రారంభించవచ్చని మీడియా నివేదికలు తెలుపుతున్నాయి. దీని కారణంగా పర్యాటకులు తమ బడ్జెట్లోనే బెస్ట్ రవాణా ఆఫ్షన్ ను ఎంచుకోవచ్చు. తద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చు. సీప్లేన్ మార్గంలో కోవలం, కుమరకోమ్, బాణాసూర్ సాగర్, మట్టుపెట్టి రిజర్వాయర్లను అనుసంధానించే ప్రణాళిక కూడా పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్టు కోసం కొన్ని ప్రత్యేక నీటి వనరులను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు రవాణా, విమానయాన శాఖ కార్యదర్శి బిజు ప్రభాకర్ తెలిపారు. తర్వాత టూర్ ఆపరేటర్ల సహకారంతో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు. దీంతో పాటు హోటళ్ల సహకారంతో టూర్ ప్యాకేజీలో భాగంగా సీప్లేన్ ప్రయాణాన్ని కూడా చేర్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version