Homeజాతీయ వార్తలుSana Malik statement: ఒక్క మగాడికి ఒక్క పెళ్ళామే సరిపోదట.. పెళ్ళాలు ఉండాలట.. ఈ మహిళ...

Sana Malik statement: ఒక్క మగాడికి ఒక్క పెళ్ళామే సరిపోదట.. పెళ్ళాలు ఉండాలట.. ఈ మహిళ ఎమ్మెల్యే గారి తెలివికి దండం పెట్టాల్సిందే..

Sana Malik statement: మనదేశంలో చట్టసభలకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు టెస్ట్ పెట్టాలి. ఆ టెస్టులో పాస్ అయిన వారికి మాత్రమే చట్టసభలకు వెళ్లే అవకాశం కల్పించాలి. ప్రజల ఓటు వేసి గెలిపించినప్పటికీ.. కచ్చితంగా ఆ టెస్ట్ నిర్వహించాలి. అందులో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే చట్ట సభకు అర్హులు అని కఠినమైన నిబంధన పెట్టాలి. ఇలాంటి నిబంధన లేకపోవడం వల్ల ఇదిగో ఇలాంటి పనికిమాలిన వారు చట్టసభలకు ఎన్నికవుతున్నారు.

ఇప్పటిదాకా బుద్ధిలేని పురుష ప్రజాప్రతినిధులు ఉన్నారు అనుకున్నాం.. కానీ ఇప్పుడు కొంతమంది మహిళా ప్రజా ప్రతినిధులు వారిని మించి పోతున్నారు. తమ బుద్ధిలేని వ్యాఖ్యలతో పరువు తీసుకుంటున్నారు. చివరికి అనకూడని మాటలు అంటూ.. చేయరాని వ్యాఖ్యలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు.

ఆమె పేరు సనా మాలిక్. మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఈమె ఎంత వరకు చదువుకున్న తెలియదు గాని.. పనికిమాలిన మాటలు మాట్లాడటంలో మాత్రం నెంబర్ వన్. అనేక సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలైంది. తాజాగా మరోసారి తన మందబుద్ధిని ప్రదర్శించుకుంది. ఈసారి ఏకంగా భారత్ లో కూడా పాకిస్తాన్ మాదిరిగా చట్టాలు ఉండాలని డిమాండ్ చేసింది. అంతేకాదు నిండు మహారాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి మీద జరిగిన చర్చలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. “ఖురాన్లో ప్రస్తావించిన అంశాలను పాకిస్థాన్ లో మాదిరిగానే భారతదేశంలో కూడా అమలు చేయాలి. ముస్లిం చట్టాలు బహు భార్యత్వాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్క మగాడికి ఒక్క భార్య సరిపోదు.. అతడికి భార్యలు కావాలి. కేవలం దీనిని మతం కోణంలో చూడకూడదు. ముసలి మహిళలు మాత్రమే వేధింపులకు గురి కావడం లేదు.. బహుభార్యత్వం అనేది ఇస్లాంలో ఉంది. దీనికి ముస్లిం చట్టాలు కూడా అనుమతిస్తున్నాయి. ఖురాన్ లో కూడా దీనికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయని” ఆమె చెప్పింది.

దీనిపై శివసేన ఎమ్మెల్యేలు గట్టిగానే స్పందించారు. త్రిబుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చి నరేంద్ర మోడీ ముస్లిం మహిళల గౌరవాన్ని పెంచితే.. సనా మాలిక్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇది ఎటువంటి విధానాలకు నిదర్శనమో చెప్పాలని శివసేన ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మరోవైపు దీనిపై మాలిక్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తాను చెప్పలేదని.. ఖురాన్ మార్గదర్శకాలను మాత్రమే పాటించాలని చెప్పినట్టు ఆమె కవర్ చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version