spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో మత రాజకీయాలు దేనికి సంకేతం..?

ఏపీలో మత రాజకీయాలు దేనికి సంకేతం..?

Religious politics in AP is a sign of what ..?

ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీపై ప్రతిపక్షం ప్రతిపక్ష పార్టీపై అధికార పక్షం విమర్శలు చేయడం సహజమే. అయితే విమర్శలకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే ప్రజల్లో కూడా ఆ విమర్శలపై వెగటు పుడుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చూస్తుంటే ప్రజల్లో ఇదే భావన కలుగుతోంది. అడ్డూఅదుపు లేకుండా ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటూ టీడీపీ, వైసీపీ పరువు తీసుకుంటున్నాయి.

Also Read : విపక్షాల సంచలనం.. డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాసం

చౌకబారు విమర్శలతో తమ పార్టీల స్థాయిని ఆ పార్టీలే తగ్గించుకుంటున్నాయి. రాష్ట్రంలోని ఏ చిన్న ఘటన జరిగినా ఆ ఘటనను పెద్దది చేసి చూపడానికి టీడీపీ ప్రయత్నిస్తోంటే వైసీపీ ఆ ఘటనలపై సరిగ్గా స్పందించకుండా విమర్శల పాలవుతోంది. అంతర్వేది రథం ఘటన ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. ప్రశ్నించడం అవసరమే కానీ టీడీపీ మతాన్ని, కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని తెలుపుతున్నాయి.

రాష్ట్రంలో మత రాజకీయాలు ఏ పార్టీకి మంచివి కావు. రాష్ట్రంలో అధికారంలో ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ప్రతిపక్షంలో ఉండే పార్టీలు కూడా రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా ఆ ఘటనకు మతం రంగు, కులం రంగు పులిమే అవకాశం ఉంది. అందువల్ల ఈ తరహా రాజకీయాలకు పార్టీలు దూరంగా ఉంటే మంచిది.

ఇలాంటి ఘటనల్లో ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకోవడం కన్నా అసలు దోషులను గుర్తించి ఇలాంటి ఘటనలకు కారణమవుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. లేదంటే మాత్రం భవిష్యత్తులో ఈ తరహా రాజకీయాలు పార్టీల ఉనికినే ప్రశ్నార్థకం చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read : ఇష్టమున్నట్టు ఉద్యోగులను తీసేయండి.. మోడీ దారుణ నిర్ణయం?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version