spot_img
Homeజాతీయ వార్తలుBandi Sanjay: విద్వేషమే బండి సంజయ్ రాజకీయమా?

Bandi Sanjay: విద్వేషమే బండి సంజయ్ రాజకీయమా?

Bandi Sanjay: తెలంగాణలో మరోసారి మత విద్వేషాలు రలుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ఏదైనా గొడవ జరిగితే దానికి కారణం కాంగ్రెస్ అవుతుందని చెబుతున్నారు. అసలు రాష్ర్టంలో కాంగ్రెస్ బతికుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరో తెలుస్తుందని విమర్శిస్తున్నారు.

Bandi Sanjay
Bandi Sanjay

బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభిస్తోంది. బండి సంజయ్ రెండు దఫాలుగా పాదయాత్ర చేరపట్టగా మొదటి సారి భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే పాదయాత్ర ప్రారంభించారు. అందుకే అది ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అక్కడి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని బావించడంతో బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. రషీద్ ఖాన్ చర్యలను ఖండిస్తున్నారు. ఆయనపై సుమోటాగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మత చాందస వాదులు ఎవరో తెలుస్తోందని వ్యాఖ్యానించారు.

Also Read: CM KCR- Telangana Formation Day: ఓవైపు డబ్బుల కటకట.. మరోవైపు కేసీఆర్ పొగడ్తల వర్షం

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. రాష్ర్టంలో పరిపాలన గాడితప్పుతోందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేయానలి చూస్తున్నాయని దుయ్యబడుతున్నారు. ఎవరు ఎన్ని చేసినా చివరకు రాష్ట్రంలో అధికారం చేపట్టడం మాకే చెల్లుతుందని మరోసారి ప్రకటిస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంఐఎంకు అమ్ముడుపోయిందని ఎద్దేవా చేస్తున్నారు.

Bandi Sanjay
Bandi Sanjay

మొత్తానికి బండి సంజయ్ ఇదే అంశంపై పోరాడాలని చూస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్న ఆయన రషీద్ ఖాన్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ప్రజల్లో రగులుతున్న భావాలకు ఆచరణ రూపం కల్పించి మరోమారు టీఆర్ఎస్, కాంగ్రెస్ లను దెబ్బతీయాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాష్ర్ట రాజకీయాలను శాసించే విధంగా తమ పార్టీ ఉనికికి గుర్తించేలా చేయాలని ఉబలాటపడుతున్నారు దీని కోసమే ప్రణాళికలు రచిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఎండగట్టి వాటికి సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read:Farmer Suicides in Telangana: ఆవిర్భావ సంబరం సరే.. ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానం సంగతేంటి?

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper