రేషన్, లాక్ డౌన్ డబ్బులపై కీలక నిర్ణయం!

తెలంగాణలో రేషన్‌ కార్డుదారులకు నేటి నుంచి ఉచిత బియ్యం, శనివారం నుంచి నగదు బదిలీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకునేందుకు కార్డుదారుడి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం, నిత్యావసర సరకుల కొనుగోలుకు కుటుంబానికి రూ.1,500 చొప్పున నగదు బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ లో మాదిరిగానే మే నెలలో కూడా ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 1:46 pm
Follow us on


తెలంగాణలో రేషన్‌ కార్డుదారులకు నేటి నుంచి ఉచిత బియ్యం, శనివారం నుంచి నగదు బదిలీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకునేందుకు కార్డుదారుడి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం, నిత్యావసర సరకుల కొనుగోలుకు కుటుంబానికి రూ.1,500 చొప్పున నగదు బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఏప్రిల్‌ లో మాదిరిగానే మే నెలలో కూడా ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ రోజు బ్యాంకులు, పోస్టాఫీసులకు సెలవు కావటంతో శనివారం నుంచి నగదు బదిలీ ప్రారంభం అవుతుంది.  కేంద్ర ప్రభుత్వం ప్రతి కార్డుదారునికి ఒక కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ లెక్కన రాష్ట్రంలోని 87.54 లక్షల కార్డుదారులకు నెలకు 8,754 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అవసరం కాగా ఇప్పటి వరకు జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య(నాఫెడ్‌) నుంచి 3,233 మెట్రిక్‌ టన్నులే సరఫరా అయింది. సాధారణంగా రేషన్‌ దుకాణాలు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకే పని చేయనుండగా కరోనా నేపథ్యంలో 23 వరకు పని చేస్తాయని పేర్కొంది.