Rain Alert: కుంభవృష్టి.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. వరదలో బస్సు

Rain Alert: తెలుగు స్టేట్లలో (Telugu States) వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో (Heavy Rains) రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. నీటితో నిండి నిండు కుండలా కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. వికారాబద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఓ పెళ్లి బృందం కారు కొట్టుకుపోవడంతో ముగ్గురు మరణించారు. సిద్దిపేట జిల్లాలో ఓ లారీ వాగులో చిక్కుకుపోయింది. వర్షాలకు అన్ని ప్రాంతాలు అతలాకుతలం […]

Written By: Srinivas, Updated On : August 31, 2021 8:50 pm
Follow us on

Rain Alert: తెలుగు స్టేట్లలో (Telugu States) వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో (Heavy Rains) రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. నీటితో నిండి నిండు కుండలా కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. వికారాబద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఓ పెళ్లి బృందం కారు కొట్టుకుపోవడంతో ముగ్గురు మరణించారు. సిద్దిపేట జిల్లాలో ఓ లారీ వాగులో చిక్కుకుపోయింది. వర్షాలకు అన్ని ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.

నిర్మల్ జిల్లాలో వర్షం బీభత్సం చేసింది. భైంసా డివిజన్ లో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. భైంసా మండలం మహాగావ్-గుండెగావ్ గ్రామాల మధ్య బ్రిడ్జి వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కుభీర్ మండల కేంద్రంలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేదరి గల్లీలో వరద నీటిలో చిక్కుకున్న ఎనిమిది మందిని స్థానికుల సాయంతో పోలీసులు రక్షించారు. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సును కూడా సురక్షితంగా బయటకు తీశారు.

రుతుపవనాలు చురుకుగా కదలడంతో రెండు మూడు రోజుల్లో రెండు స్టేట్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రెండు ప్రాంతాల్లో వర్షప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు.

తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు అస్థిరంగా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. దీంతో ఇంకా తెలుగు ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రాజక్టులు సైతం నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. లోయర్ మానేరు డ్యాం గేట్టు ఎత్తి నీటిని దిగువకు వదులున్నారు. ఇంకా రాష్ర్టంలోని ప్రాజెక్టులన్ని జలకళను సంతరించుకుంటున్నాయి.