రఘురామ ఆటకట్టు.. నెక్ట్స్ ఎల్లో జర్నలిస్టులేనట?

సోషల్ మీడియా, మీడియాను ఆధారంగా చేసుకొని ఏపీలో కొలువుదీరిన జగన్ సర్కార్ ను అభాసుపాలు చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆట ఈరోజుతో కట్టైంది. ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. జగన్ ను టార్గెట్ చేసి కోర్టుల్లో.. బయట మీడియాలో విసిగిస్తున్న రఘురామపై మరిన్ని కేసులు పెట్టి బయటకు రాకుండా చేసేందుకు జగన్ సర్కార్ స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. ఇక రఘురామ తర్వాత నెక్ట్స్ ఎల్లో జర్నలిస్టులే టార్గెట్ […]

Written By: NARESH, Updated On : May 14, 2021 9:09 pm
Follow us on

సోషల్ మీడియా, మీడియాను ఆధారంగా చేసుకొని ఏపీలో కొలువుదీరిన జగన్ సర్కార్ ను అభాసుపాలు చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆట ఈరోజుతో కట్టైంది. ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. జగన్ ను టార్గెట్ చేసి కోర్టుల్లో.. బయట మీడియాలో విసిగిస్తున్న రఘురామపై మరిన్ని కేసులు పెట్టి బయటకు రాకుండా చేసేందుకు జగన్ సర్కార్ స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం.

ఇక రఘురామ తర్వాత నెక్ట్స్ ఎల్లో జర్నలిస్టులే టార్గెట్ గా ఏపీ సీఎం జగన్ కదులుతున్నారని టాక్. జగన్ సర్కార్ పై ఎల్లో చానెల్స్ లో దుమ్మెత్తిపోస్తున్న ఆ ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ఇప్పటికే పలు పక్కా ఆధారాలు సేకరించిందని.. వారిని త్వరలోనే అరెస్ట్ చేయబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం ఏపీ సీఐడీ బ్యాచ్ ఈ ముగ్గురు జర్నలిస్టులను అదును చూసి అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లోనే మకాం వేసినట్టు సమాచారం. టీవీ డిబేట్ల ద్వారా జగన్ సర్కార్ ను అభాసుపాలు చేయడం.. తిట్టించడమే ధ్యేయంగా ఈ ముగ్గురు జర్నలిస్టులు రోజూ చేస్తున్నదంతా సేకరించి కోర్టుల్లో కూడా వీరికి ఊరట లభించకుండా ఏపీ సీఐడీ ఆధారాలతో అరెస్ట్ చేయడానికి స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబుకు బాకా ఊదే చానెల్ జర్నలిస్టుతోపాటు మరో నాయుడుకు చెందిన చానెల్ లోని సీనియర్ జర్నలిస్టు.. ఇక ఇదివరకు టీడీపీ చానెల్ లో పనిచేసి వేరే దాంట్లో చేస్తున్న జర్నలిస్టు ముగ్గురిని ఏ సమయంలోనే ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యిందన్న టాక్ ఇప్పుడు ఏపీ అధికారవర్గాల్లో సాగుతోంది. మరి వారి అరెస్ట్ కూడా అయితే జగన్ ను వెంటాడుతున్న ఎల్లో బ్యాచ్ కు కష్టాలు తప్పవన్న ప్రచరాం సాగుతోంది.