Pragyan Rover Chandrayaan 3: ల్యాండర్‌ను ఫొటో తీసిన రోవర్‌.. స్మైల్‌ ప్లీజ్‌ అంటూ షేర్‌ చేసిన ఇస్రో

తాజాగా తనని తీసుకువెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌నే ఫోటో తీసింది ప్రజ్ఞాన్‌ రోవర్‌. ఈ ఫొటోను ఎక్స్‌(ట్విటర్‌) ఖాతా ద్వారా ఇస్రో పంచుకుంది. స్మైల్‌ ప్లీజ్‌ అంటూ ఈ ఫోటోను షేర్‌ చేసింది ఇస్రో.

Written By: Raj Shekar, Updated On : August 30, 2023 5:55 pm

Pragyan Rover Chandrayaan 3

Follow us on

Pragyan Rover Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌–3 విజవంతమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది భారత్‌. ఇక చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ సేఫ్‌ ల్యాండ్‌ అయిన తర్వాత.. అందులో నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పనిని విజయవంతంగా చేస్తోంది. జాబిల్లికి సంబంధించిన అనేక సమాచారాన్ని పంపుతుంది. ఇస్రో ఆశించినదానికన్నా ఎక్కువ పనితీరు కనబరుస్తోంది.

తాజాగా ల్యాండర్‌ ఫొటోలు..
తాజాగా తనని తీసుకువెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌నే ఫోటో తీసింది ప్రజ్ఞాన్‌ రోవర్‌. ఈ ఫొటోను ఎక్స్‌(ట్విటర్‌) ఖాతా ద్వారా ఇస్రో పంచుకుంది. స్మైల్‌ ప్లీజ్‌ అంటూ ఈ ఫోటోను షేర్‌ చేసింది ఇస్రో. చంద్రుడిపై ఉపరితలంపై వారం రోజులుగా అన్వేషణ కొనసాగిస్తోన్న ప్రజ్ఞాన్‌ రోవర్‌.. విక్రమ్‌ ల్యాండర్‌ను తొలిసారిగా ఫొటోలు తీసింది. విక్రమ్‌ ల్యాండర్‌ను తన నావిగేషన్‌ కెమెరాల సాయంతో రోవర్‌ ఫోటోలు తీసింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌లో అమర్చిన నావిగేషన్‌ కెమెరాలను(నావ్‌కేమ్‌)తో ఈ ఫోటోలు తీసింది రోవర్‌. ఇక ఈ కెమెరాలను బెంగళూరులోని ఎలక్ట్రో–ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌ అభివృద్ధి చేసింది. ఈ కెమెరాతో హైక్వాలిటీ ఫొటోలను తీయవచ్చు. ఇక తనను తీసుకువెళ్లిన ల్యాండర్‌ను స్మైల్‌ ప్లీజ్‌ అంటూ ఫోటో తీసిందని ఇస్రో ట్వీట్‌ చేసింది.

జాబిల్లి గురించి అనేక కొత్త విషయాలు..
ఇక జాబిల్లి గురించి ప్రజ్ఞాన్‌∙రోవర్‌ అనేక కొత్త కొత్త విషయాలను తెలియజేస్తోంది. ఇప్పటికే చంద్రునిపై చంద్రుడిపై ఆక్సిజన్, సిలికాన్‌ వంటి మూలకాలను గుర్తించి సమాచారాన్ని ఇస్రోకు పంపింది. అంతేకాకుండా చంద్రుడి ఉపరితలంపై అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్, టైటానియం, మాంగనీస్‌ వంటి మూలకాలను కూడా గుర్తించారు. ఇక హైడ్రోజన్‌ కోసం ప్రజ్ఞాన్‌ రోవర్‌ అన్వేషణ ప్రారంభించింది. అది కనుక ఉంటే చంద్రుడిపై నివసించే అవకాశం మనుషులకు దొరుకుతుంది. ఇక చంద్రుడిపై టెంపరేచర్‌ కు సంబంధించిన సమాచారాన్నికూడా ఇస్రో పొందింది. త్వరలోనే మనుషులు జాబిల్లిపై జీవించవచ్చని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.