జాతీయ వార్తలుకేంద్రంపై దండెత్తుకొస్తున్న రైతులు.. తీవ్ర ఉద్రిక్తత

కేంద్రంపై దండెత్తుకొస్తున్న రైతులు.. తీవ్ర ఉద్రిక్తత

Farmers Tractor Rally
సాగు చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గణతంత్ర దినోత్సవాన అటు పరేడ్‌ నడుస్తుండగా.. ఇటు రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ గణతంత్ర పరేడ్‌’ అనుమతించిన సమయాని కంటే ముందే రైతులు ర్యాలీ ప్రారంభించారు. మరోవైపు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతుండడంతో రైతులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు.

Also Read: చదువు నేర్పిన మూర్ఖత్వం.. : బిడ్డలను చంపుకున్న కన్నపేగు..

రైతుల ర్యాలీ.. అడ్డుకోవాలని పోలీసుల ప్రయత్నాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ర్యాలీగా బయలుదేరాయి. ర్యాలీ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు వారితో ఘర్షణకు దిగారు. బారీకేడ్లను సైతం రైతులు తొలగించారు. సింఘు, ఘాజీపూర్‌‌ ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

మరోవైపు.. ముకర్బా ప్రాంతంలో బారికేడ్లను తొలగించే క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనంపైకి ఎక్కారు. దీంతో వారిని నియంత్రించేందుకు ఓ దశలో పోలీసులు టియర్‌‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో భద్రతాబలగాల వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఇంతలో రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడ్‌ ముగియడంతో పోలీసులు వెనక్కి తగ్గి ర్యాలీ ముందుకు సాగేందుకు పర్మిషన్‌ ఇచ్చారు.

Also Read: ఏపీలో ‘పంచాయితీ’ హీట్‌

ఇదిలా ఉండగా.. ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఉదయం కాగానే ట్రాక్టర్లతో ఢిల్లీకి చేరుకున్నారు. పంజాబ్‌, హరియాణాతోపాటు ఉత్తరప్రదేశ్‌ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ట్రాక్టర్‌‌కు జాతీయ జెండా ఏర్పాటు చేశారు. మరోవైపు మహిళలు, పురుషులు ట్రాక్టర్లలో సంప్రదాయ నృత్యాలు, నాటకాలు ప్రదర్శించారు. పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో ర్యాలీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Delhi Blast Red Fort Explosion : నిన్న ఏటీఎస్ దాడులు.. నేడు ఢిల్లీ ఎర్రకోటలో పేలుళ్లు.. ఎన్నాళ్లీ మారణ హోమం

Delhi Blast Red Fort Explosion : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర గేట్ -1 వద్ద...

Telangana Urea shortage : తెలంగాణలో రైతుల తిరుగుబాటు.. వీడియో వైరల్

Telangana Urea shortage : పొట్ట దశలో వరి ఉంది. కాయ దశలో పత్తి ఉంది. మొక్కజొన్న పీచులు వేస్తోంది. మిరప పూతకు వచ్చింది. పసుపు ఏపుగా పెరుగుతోంది. ఇలా ప్రతి పంట...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...
Exit mobile version