అచ్చెన్న, జేసీ ఔట్.. నెక్ట్స్ ఇతడే!

టీడీపీకి బలమైన నేతలుగా ఉన్న అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలను వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా మూసేసింది. ఇప్పుడు నెక్ట్స్ వైసీపీ ప్రభుత్వం టార్గెట్ ఎవరు? ఎవరు? అని ఆరాతీస్తుంటే అడ్డంగా బుక్కయ్యారట.. మన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. తాజాగా వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు యనమల రామకృష్ణుడి మీద ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనను మూసేసేందుకు వైసీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. టీడీపీలో సీనియర్ నేతలు, కీరోల్ పోషించే ఇద్దరు మాజీ […]

Written By: NARESH, Updated On : June 13, 2020 3:26 pm
Follow us on


టీడీపీకి బలమైన నేతలుగా ఉన్న అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలను వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా మూసేసింది. ఇప్పుడు నెక్ట్స్ వైసీపీ ప్రభుత్వం టార్గెట్ ఎవరు? ఎవరు? అని ఆరాతీస్తుంటే అడ్డంగా బుక్కయ్యారట.. మన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. తాజాగా వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు యనమల రామకృష్ణుడి మీద ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనను మూసేసేందుకు వైసీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

టీడీపీలో సీనియర్ నేతలు, కీరోల్ పోషించే ఇద్దరు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్పలపై తాజాగా ఒక దళిత మహిళ తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకు వేరే మహిళను ఇచ్చి వివాహం చేసేందుకు యనమల, చిన్నరాజప్ప ప్రయత్నించారని.. తనను కలవనీయకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో యనమల, చిన్నరాజప్పపై స్ట్రాంగ్ కేసు పెట్టింది.

తన భర్త రాధాకృష్ణతో అనంత లక్ష్మీ అనే మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని.. ఇద్దరు మాజీ మంత్రులు యనమల, చిన్నరాజప్పలు ఆమెకు సహాయం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. అనంతలక్ష్మిని అడ్డుకొని తన భర్తను తన దరికి చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్ ను బీసీలపై దాడిగా టీడీపీ ఫోకస్ చేసింది. ఇప్పుడు దళిత మహిళ స్వయంగా టీడీపీ నేతలపై కేసులు పెట్టడం.. వైసీపీ ప్రభుత్వం వారి అరెస్ట్ కు సిద్ధం అవుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ కోణాన్ని టీడీపీ ఎలా మెయింటేన్ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.