
ఆగస్టు 15 భారత్ స్వాతంత్ర్య దినోత్సవం. కానీ మనకంటే ఒకరోజు ముందే ఆగస్టు 14న పాకిస్తాన్ కు స్వతంత్ర్యం వచ్చింది. భారత్ కంటే ముందే పాకిస్తాన్ ముస్లిం దేశంగా ఆవిర్భవించింది. అఖండ భారతవానికి స్వాతంత్ర్యం ఇస్తూ పోతూ పోతూ బ్రిటీష్ వారు రాజేసిన కుంపటి ఇప్పటికీ భారత్-పాక్ లను శత్రుదేశాలుగా మలిచి కొట్టుకునేలా చేస్తూనే ఉంది. ఉమ్మడి భారత్ ఉంటే ఇప్పుడు చైనాను తలదన్నేలా బలంగా ఉండేది. రెండు దేశాలుగా విడిపోయి ఇప్పుడు యుద్ధాలతో బలైపోతున్నారు.
అయితే ఆగస్టు 14, 1947 నాడు జరిగిన దారుణాలను గుర్తు చేసుకొని ప్రధాని మోడీ ఎమోషనల్ అయ్యారు. ఆగస్టు 14 ఒక భయంకరమైన రోజుగా అభివర్ణించారు. భారత స్వాతంత్ర్య సంబరాలకు ముందు రోజును గుర్తు చేసుకున్న మోడీ కీలక ప్రకటన చేశారు.దీన్ని ‘విభజన భయానక జ్ఞాపకాల దినోత్సవం’గా జరుపుకోవాలని భారత దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు.
ఆగస్టు 14న పాకిస్తాన్ కు బ్రిటీష్ వారు స్వాతంత్ర్యం ఇచ్చారు. ఈ నిర్ణయం చాలా మందికి అప్పట్లో నచ్చలేదు. ఈ క్రమంలోనే ఇండియాలోని చాలా మంది ముస్లింలు పాకిస్తాన్ వెళ్లిపోయారు. పాకిస్తాన్ లోని హిందువులు పొట్ట చేతపట్టుకొని భారత్ కు వచ్చేశారు.
అయితే భారత్ నుంచి వెళ్లిన వారు సురక్షితంగా పాకిస్తాన్ చేరారు. అయితే పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్న వారిని చిత్రహింసలకు గురిచేసి వారి ఆస్తులు, బంగారం లాక్కున్నారన్న విమర్శలు ఉన్నాయి. అప్పటి ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ ట్విట్టర్ లో సంచలన ప్రకటన చేశారు.
‘విభజన బాధల్ని ఎప్పటికీ మర్చిపోలేం.. లక్షల మంది మన సోదర సోదరీమణులు తరలిపోవాల్సి వచ్చింది. చాలా మంది అప్పట్లో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి మన ప్రజల బాధలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ ‘ఆగస్టు 14’ను మనం విభజన భయానక జ్ఞాపకాల దినంగా జరుపుకుంటాం. ఐక్యత, సామాజిక సామరస్యం, మాన సాధికారితను మరింత బలోపేతం చేద్దాం’ అని మోడీ ట్వీట్ చేశాడు.
Partition’s pains can never be forgotten. Millions of our sisters and brothers were displaced and many lost their lives due to mindless hate and violence. In memory of the struggles and sacrifices of our people, 14th August will be observed as Partition Horrors Remembrance Day.
— Narendra Modi (@narendramodi) August 14, 2021