ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని ఏళ్లుగా ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి తాజాగా జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read: బామ్మర్ధి బాలయ్య సలహా.. దెబ్బకు పాటించిన చంద్రబాబు
తాజాగా ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడుతాయని తెలిపింది.
29-01-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులని వెల్లడించింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల కార్యక్రమం చేపట్టనున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భూకంపం.. ఎందుకొస్తుందంటే?
మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కు ఎంతో మంది కలిసి విన్నవించారు. తాజాగా ఉపాధ్యాయులందరికీ సీఎం జగన్ బదిలీలకు అవకాశం కల్పించారు.