spot_img
Homeఆంధ్రప్రదేశ్‌పవనన్న ఫ్యాన్స్.. జగనన్నకు జై కొట్టారు..

పవనన్న ఫ్యాన్స్.. జగనన్నకు జై కొట్టారు..

Pawan Kalyan
సినిమా పరంగా పవనన్న మాకు దేవుడు.. కానీ రాజకీయాలు.. పరిపాలనలో మాత్రం.. మాకు జగనన్న మాటే వేదం అంటూ.. గతంలో ‘ పవనన్నను ప్రేమిస్తాం.. జగనన్నకు ఓటేస్తాం’ అంటూ.. ఏపీలో ఊరూవాడా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదంతా వైసీపీ ప్లాన్ అనీ.. ఎన్నికల్లో జనసేను ఓట్లు పడకుండా.. మైండ్ గేమ్ ఆడారని అప్పట్లో పవన్ కల్యాణ్ ఓడిపోయాక అంతా అనుకున్నారు. ఇప్పడు పవన్ కల్యాణ్ కూడా అదే నిజమని నమ్ముతున్నాడు. ఆ మాటనే పవర్ స్టారే తన నోటితో చెప్పారు… తిరుపతి వెంకన్న సాక్షిగా.. ఇలా మాట్లాడారు..

Also Read: బ్రేకింగ్: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ

తనపై అభిమానం ఉన్నా.. ఏపీ ప్రజలు జగన్ కే ఓటు వేశారు. జగన్ ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారని నమ్మారు. ఇప్పడు ఆ నమ్మకాన్ని జగన్ కాల రాస్తున్నారని తిరుపతి వేదికగా చెప్పుకొచ్చారు. అయితే నిజంగా పవన్ కల్యాణ్ పై అభిమానం ఉన్న వారు జగన్ కు ఓటు వేయరని, జనసేననే గెలిపిస్తారని ఆశించారు. కానీ ఆ ఆశలను నిరాశ చేస్తూ.. కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే జనసేనకు పోలయ్యాయి.

ఎన్నికల ప్రచార సమయంలో పవన్ సభకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఫలితాల తరువాత దీన్ని పరిశీలించిన కొందరు రాజకీయ విశ్లేషకులు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా జగన్ కే ఓటు వేశారని తేల్చేశారు. ఎన్నికల ముందుకూడా పవన్ కల్యాణ్ ను వైస్ జగన్ వ్యక్తి గతంగా ఎంతో తిట్టారు. నిత్య పెళ్లి కొడుకుగా.. అభివర్ణించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ సైతం తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి దిగారు. ఇలాంటి సమయంలో వపన్ను అభిమానించేవారు… జగన్కు ఓటేస్తారని ఎవరూ నమ్మలేదు. అయితే వీరిలో చాలా మంది వివిధ వర్గాలకు చెందిన వారు జగన్ కు ఓటేసి.. గెలిపించేశారు.

Also Read: చరిత్రదాచిన భారత యోధుడు ‘సుభాష్ చంద్రబోస్’

ఎన్నికల తరువాత దీన్ని విశ్లేషించిన రాజకీయ వేత్తలు.. కేవలం బలహీన నాయకులను అభ్యర్థలుగా నిలబెట్టడమే.. పవన్ కల్యాణ్ చేసిన పొరపాటని తేల్చారు. సామాజిక వర్గం పరంగా అప్పటి అధికార పార్టీపై కులధ్వేషం నింపడం వల్లే వైసీపీ గెలిచిందని అంటున్నారు. వపన్ కు ఓటు వేస్తే… అది టీడీపీకి బలం అని ప్రచారం చేయడం .. వైసీపీ కూడా టీడీపీని అస్త్రంగా జనసేనపై సంధించడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఇప్పడు పవన్ కల్యాణ్ కూడా నమ్ముతున్నారు. తిరుపతిలో మాట్లడిన ఆయన వైసీపీ కుళ్లు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. హిందుత్వంపై అధికార పార్టీ చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు. మొత్తానికి గతానికి ఇప్పటికి.. డైరెక్టర్ ఎటాక్ లో పవన్ కల్యాణ్ కొంత మేర రాజకీయాలు నేర్చుకున్నారని అర్థం అవుతోంది. అయితే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో బీజేపీతో పొత్తు వద్దన్న జన అధినేత ఎలా ముందుకు సాగాలన్నదానిపై క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version