spot_img
Homeజాతీయ వార్తలుPAN-Aadhaar linking: పాన్‌–ఆధార్‌ లింకింగ్‌.. రేపటి వరకే ఛాన్స్‌..

PAN-Aadhaar linking: పాన్‌–ఆధార్‌ లింకింగ్‌.. రేపటి వరకే ఛాన్స్‌..

PAN-Aadhaar linking: పన్ను ఎగవేతదారులకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఐటీఆర్‌ అమలు చేస్తున్నా.. చాలామంది తప్పించుకుంటున్నారు. ఇక అవినీతి సొమ్ము దేశం దాటిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆధార్‌తో పాన్‌కార్డు లింక్‌ తప్పనిసరి చేసింది. ఇప్పటికే చాలాసార్లు ఉచిత అవకాశం కల్పించింది. ఈ ఏడాది జూలై నుంచి రూ.1000 చార్జితో లింక్‌ అవకాశం కల్పించింది. ఈ గడువు కూడా డిసెంబర్‌ 31తో ముగియనుంది. అంటే గడువు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. లింక్‌ చేయనిపక్షంలో పాన్‌కార్డు డీ యాక్టివేట్‌ అవుతుంది. దీంతో ఆదాయపు ప్రకటన ఫైలింగ్, రిఫండ్‌లు, బ్యాంకు లావాదేవీలు కష్టమవుతాయి.

స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
వెబ్‌ పోర్టల్‌ ద్వారా…
– ఐటీ ఈ–ఫైలింగ్‌ సైట్‌కు (incometax.gov.in) వెళ్లండి.
– ’ఆధార్‌ లింక్‌ స్టేటస్‌’ ఎంపిక చేసుకోవాలి.
– పాన్, ఆధార్‌ వివరాలు ఇచ్చి సబ్మిట్‌ చేయండి.
– స్క్రీన్‌లో స్థితి కనిపిస్తుంది.

ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా
‘UID PAN’ తర్వాత 12 అక్షరాల ఆధార్‌ నంబర్, 10 అక్షరాల పాన్‌ నంబర్‌ ఇచ్చి 567678 లేదా 56161కు పంపండి. ఉదాయహరణ: UID PAN 34512349891 CFIED1234J.

లింక్‌ చేయడం ఇలా..
1. ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌లో లాగిన్‌ అవ్వండి.
2. ప్రొఫైల్‌ సెక్షన్‌లో ’పాన్‌–ఆధార్‌ లింక్‌’ ఎంపిక చేయండి.
3. వివరాలు నమోదు చేసి, ఈ–పే ట్యాక్స్‌ ద్వారా చెల్లింపు పూర్తి చేయండి.
4. చలాన్‌ జనరేట్‌ చేసి, బ్యాంకు పోర్టల్‌లో డబ్బు చెల్లించండి.
5. తిరిగి పోర్టల్‌కు వచ్చి, పాన్, ఆధార్, పేరు వాలిడేట్‌ చేయండి.
6. ఆధార్‌ మొబైల్‌కు వచ్చే ఒటీపీతో సబ్మిట్‌ చేయండి.

చెల్లింపు విజయవంతమైన తర్వాత 1–2 రోజుల్లో స్థితి తనిఖీ చేయండి.

వివరాలు సరిపోలేటప్పుడు చర్యలు
– ఆధార్‌ వివరాలు సరిచేయడానికి UIDAI సైట్‌ ఉపయోగించండి.
– పాన్‌ సవరణకు Protean (NSDL) లేదా UTIITSLఖీ ఔలో అప్‌డేట్‌ చేయండి.
– సమస్యలు ఉంటే, పాన్‌ సర్వీస్‌ సెంటర్‌లో బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ తీసుకోండి.

డెడ్‌లైన్‌ మిస్‌ అయితే పరిణామాలు
– ఆదాయపు ప్రకటన ఫైలింగ్‌ ఆగిపోతుంది, రిఫండ్‌లు రావు.
– టీడీఎస్, టీసీఎస్‌ రేట్లు ఎక్కువగా వసూలు చేస్తారు.
– బ్యాంకు ఖాతా ఓపెనింగ్, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు, ఇతర లావాదేవీలు అసాధ్యం.

జరిమానా మినహాయింపులు
డెడ్‌లైన్‌ తర్వాత లింక్‌ చేయగలిగితే రూ.1,000 జరిమానా చెల్లించాలి. అయితే, అక్టోబర్‌ 1, 2024 తర్వాత ఆధార్‌ ఐడీతో అనుపాలిత పాన్‌లకు డెడ్‌లైన్‌ వరకు ఉచితం. 2017 జూలై 1 ముందు పొందిన పాన్‌లకు ఇది తప్పనిసరి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper